యూనివర్సిల్ స్టార్ కమల్ హాసన్ శంకర్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇండియన్ 2 సినిమా షూటింగ్ స్పాట్ లో క్రేన్ ప్రమాదం జరిగింది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ సమయంలో చిత్ర నిర్మాణ సంస్థ మరియు హీరో కమల్ హాసన్ లు బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వడం జరిగింది.
కమల్ ఒక్కొక్కరికి కోటి చొప్పున పరిహారం అందించగా నిర్మాణ సంస్థ లైకా నుండి ఒక్కొక్కరికి రెండు కోట్ల చొప్పున పరిహారం ను అందించారు. బాధిత కుటుంబాలకు స్వయంగా కమల్ మరియు శంకర్ లు కలిసి ఈ మొత్తం ను అందించారు.
ఇకపై ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని షూటింగ్స్ సమయంలో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు నిర్మాణ సంస్థలతో పాటు అందరూ కూడా అవగాహన కలిగి ఉండాలి అంటూ సూచించాడు. బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించారు కనుక షూటింగ్ ను మళ్ళీ మొదలు పెట్టేందుకు సిద్ధం అవుతున్నట్లుగా భావించవచ్చు.