Templates by BIGtheme NET
Home >> Cinema News >> కేజీఎఫ్ డైరెక్టర్ ని అలా లాక్ చేసిన క్రేజీ స్టార్లు

కేజీఎఫ్ డైరెక్టర్ ని అలా లాక్ చేసిన క్రేజీ స్టార్లు


కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ క్రేజు గురించి తెలిసిందే. ఒకే ఒక్క సంచలన విజయంతో అతడి పేరు ఇంటా బయటా మార్మోగిపోయింది. కోలార్ బంగారు గనుల మాఫియా కథని రా అండ్ రస్టిక్ గా హార్డ్ హిట్టింగ్ మాఫియాను మరిపించేలా చూపించిన తీరు సినీప్రపంచాన్ని విస్మయానికి గురి చేసింది. రాకీభాయ్ లో హీరోయిజాన్ని పరాకాష్టలో చూపించిన తీరు అగ్ర హీరోల్ని ఎంతగానో ఆకట్టుకుంది. అటుపై ఆఫర్ల వెల్లువ మొదలైంది.

కేజీఎఫ్ 2లో అధీరా పాత్రలో నటించమని అడగ్గానే సంజయ్ దత్ లాంటి సీనియర్ బాలీవుడ్ హీరో ఏమాత్రం ఆలోచించకుండా అంగీకరించాడు. పార్ట్ 1కి నో చెప్పి పార్ట్ 2 విషయంలో ఎలాంటి తడబాటు లేకుండా ఎస్ చెప్పేశారు దత్. ఇక ప్రశాంత్ నీల్ కి కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హోంబలే తో వరుసగా మూడు సినిమాల కమిట్ మెంట్ ఉందని తెలిసింది. అంటే ఇదే బ్యానర్ లో కేజీఎఫ్.. కేజీఎఫ్ 2 తర్వాత మరో సినిమా చేస్తాడట. ఈ మూవీ ఎవరితో ఉంటుంది? అన్నది ఆరా తీస్తే.. కచ్ఛితంగా బాహుబలి స్టార్ ప్రభాస్ తో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ప్రభాస్ కి ఇంతకుముందే ప్రశాంత్ నీల్ కథ చెప్పాడు. ఆ తర్వాత పలుమార్లు స్క్రిప్టు గురించి మాట్లాడుకున్నారని టాలీవుడ్ లో గుసగుసలు వినిపించాయి.

ఇక ఎలానూ మైత్రి మూవీ మేకర్స్ కి ప్రశాంత్ నీల్ కమిట్ మెంట్ ఇచ్చారు. ఎన్టీఆర్ కోసం ఇప్పటికే అతడు స్క్రిప్టును రెడీ చేస్తున్నాడు. కేజీఎఫ్ 2 తర్వాత ఈ సినిమా ఉంటుందని మైత్రి అధినేతలు ప్రకటించారు. అంటే దీనిని బట్టి ఇటు నాగ్ అశ్విన్ తో సినిమాని ముగించి ప్రభాస్ కేజీఎఫ్ డైరెక్టర్ కి అందుబాటులోకొస్తాడని అంచనా వేస్తున్నారు. అప్పటికి ఎన్టీఆర్ తో సినిమాని ప్రశాంత్ నీల్ పూర్తి చేస్తారు. ప్రస్తుతం వీళ్లంతా ఎవరికి వారు వేరే వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.