Templates by BIGtheme NET
Home >> Cinema News >> కొంతకాలం ‘ట్విట్టర్’కు దూరంగా ఉంటానంటున్న కుష్బూ

కొంతకాలం ‘ట్విట్టర్’కు దూరంగా ఉంటానంటున్న కుష్బూ


సౌత్ ఇండియన్ సీనియర్ యాక్ట్రెస్ కుష్బూ సుందర్ తన అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. తన సినీ కెరీర్ తెలుగులోనే ప్రారంభించిన ఖుష్బూ.. దాదాపు సౌత్ స్టార్ హీరోలు అందరితో నటించింది. అయితే తాజాగా తను ట్విట్టర్ కు కొంతకాలం దూరంగా ఉండబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఖుష్బూ ట్విట్టర్ కి దూరంగా ఉండటం ఇది ఫస్ట్ టైం కాదు. ఇంతకుముందు కూడా ఓసారి ట్విట్టర్ కు దూరంగా ఉంది. ఇక ఈరోజు ట్విట్టర్ ద్వారా.. “హాయ్ ఫ్రెండ్స్.. ఈరోజు ఉదయం పొరపాటున నా కంటికి చిన్నపాటి గాయమైంది. డాక్టర్లు సంప్రదిస్తే కంటికి ఆపరేషన్ చేసి రెస్ట్ తీసుకోమని సలహా ఇచ్చారు. అందుకే కొద్దికాలం పాటు ట్విట్టర్కు దూరంగా ఉండబోతున్నాను. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. త్వరలోనే మళ్లీ మీ ముందుకు తప్పకుండా వస్తాను. మీరందరూ తగిన జాగ్రత్తలు పాటిస్తూ.. మాస్కులు ధరించండి.

అలాగే భౌతిక దూరం పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలి” అంటూ కుష్బూ ట్వీట్ చేసింది. ఇదిలా ఉండగా.. కుష్బూ ఇదివరకే తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందంటూ వాపోయింది. ట్విట్టర్ పాస్వర్డ్ మరిచిపోవడం కానీ ఏదైనా టెక్నికల్ ఇష్యూ రావడం కానీ జరిగి ఉంటుందని ఖుష్బూ తెలిపింది. అంతేగాక ఈ విషయమై ఎవరికైనా ఇన్స్టాగ్రామ్ వేదికగా టెక్నికల్ ప్రాబ్లెమ్ సాల్వ్ చేసుకుంది. ఇక కుష్బూ గతేడాది తన ట్విట్టర్ అకౌంట్ను డీయాక్టివేట్ చేశారు. ట్విట్టర్లో తనను ఎక్కువగా ట్రోల్ చేయడంతో మనస్తాపం చెందిన ఆమె సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. అనవసరపు టెన్షన్లను తప్పించుకోవడానికి తాను సోషల్ మీడియా నుంచి వైదొలగాలని అనుకొంటున్నట్లు అప్పట్లో చెప్పింది. కానీ సన్నిహితుల సలహా మేరకు తన ట్విట్టర్ అకౌంట్ను యాక్టివేట్ చేసుకొన్నారు. ఇక ప్రస్తుతం ఖుష్బూ సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన అన్నాథే మూవీలో నటిస్తోంది. డైరెక్టర్ శివ ఈ సినిమాను రూపొందిస్తున్నారు.