Templates by BIGtheme NET
Home >> Cinema News >> #NTR30 : ఎన్టీఆర్30 : హీరోయిన్ పారితోషికం మూడు రెట్లు పెంచేశారు

#NTR30 : ఎన్టీఆర్30 : హీరోయిన్ పారితోషికం మూడు రెట్లు పెంచేశారు


మహేష్ బాబు తో భరత్ అనే నేను మరియు రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమా ల్లో హీరోయిన్ గా నటించిన కియారా అద్వానీ మళ్లీ టాలీవుడ్ లో కనిపించలేదు. బాలీవుడ్ లో బిజీ అయిన ఈ అమ్మడు మళ్లీ టాలీవుడ్ కు రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది. బాలీవుడ్ లో ఈ అమ్మడి సినిమాలకు మంచి స్పందన రావడంతో అక్కడ ఈమె పారితోషికం భారీగా పెరిగింది. అదే పారితోషికంను టాలీవుడ్ లో కూడా ఈమె వసూళ్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కియారా అద్వానీ టాలీవుడ్ లో నటించబోతున్నట్లుగా చెప్పింది. కాని ఎవరితో అనే క్లారిటీ ఇవ్వలేదు. కాని ఇండస్ట్రీ వర్గాల ద్వారా మాత్రం ఆమె ఎన్టీఆర్ 30 సినిమా లో నటిస్తుందని.. అందుకు గాను భారీ పారితోషికంను తీసుకుంటుందని చెబుతున్నారు.

భరత్ అనే నేను సినిమా సమయంలో కియారా అద్వానీ పారితోషికం చాలా తక్కువ. ఆ సమయంలో ఆమెకు బాలీవుడ్ లో కూడా పెద్దగా క్రేజ్ లేదు. కియారా అద్వానీ తెలుగు లో మొదటి సినిమాకు గాను కోటి లోపు పారితోషికం తీసుకోగా రెండవ సినిమా వినయ విధేయ రామ సినిమా కు కోటికి కాస్త ఎక్కువ పారితోషికం అందుకుందట. కాని మూడవ సినిమా కు మాత్రం గతంలో తీసుకున్న పారితోషికంకు మూడు రెట్లు తీసుకుంటున్నట్లుగా మీడియా సర్కిల్స్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

కొరటాల శివ గతంలో కియారా తో సినిమా చేసి సక్సెస్ దక్కించుకున్న కారణంగా ఆమెనే మళ్లీ తన సినిమాలో నటింపజేస్తున్నాడు. అందుకోసం ఆమె కు భారీ పారితోషికం కట్టబెడుతున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ లో తీసుకుంటున్న పారితోషికంకు అదనంగా ఆమె ఖర్చులను కూడా నిర్మాతలు చెల్లించబోతున్నారు. పాన్ ఇండియా అప్పీల్ కియారా వల్ల కలుగుతుందనిన.. ఎన్టీఆర్ కు సరి జోడీ అనే ఉద్దేశ్యంతో ఆమె పారితోషికం కాస్త అతి అయినా కూడా మేకర్స్ ముందడుగు వేశారని మీడియా సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. ఆగస్టు లేదా సెప్టెంబర్ నుండి ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.