Templates by BIGtheme NET
Home >> Cinema News >> మతి చెడగొట్టాడు .. ఆ బోయ్ లో స్పార్క్ నచ్చింది!-మహేష్

మతి చెడగొట్టాడు .. ఆ బోయ్ లో స్పార్క్ నచ్చింది!-మహేష్


నవతరం నటీనటులు దర్శకులను ప్రోత్సహించేందుకు మన స్టార్ హీరోలు ఎల్లపుడూ ముందుంటారు. సూపర్ స్టార్ మహేష్ వరుసగా యువహీరోలు దర్శకులకు తన సొంత బ్యానర్ లో అవకాశాలిస్తూ వారి కోసం సినిమాల్ని నిర్మిస్తున్నారు. నటీనటుల్ని ఎంకరేజ్ చేస్తున్నారు.

తాజాగా ఆయన నవతరం ట్యాలెంట్ తో తెరకెక్కిన `జాతిరత్నాలు` సినిమా వీక్షించి ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సినిమా అద్భుతంగా ఉంది. తుది కంటా పూర్తిగా ఎంజాయ్ చేశానని మహేష్ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఇందులో ఒక జాతిరత్నం గా కనిపించిన నవీన్ పోలిశెట్టిపైనా ప్రశంసలు కురిపించారు.

మతి చెడొట్టాడు.. ఆ బోయ్ లో స్పార్క్ వేరు! అంటూ తనదైన శైలిలో నవీన్ నటనపై ప్రశంసలు కురిపించారు. నవీన్ ఇంతకుముందు మహేష్ నటించిన `1- నేనొక్కడినే` చిత్రంలో తన వీరాభిమానిగా నటించారు. నాటి జ్ఞాపకాల్లోకి వెళుతూ.. వన్ మూవీ సెట్స్ తో అతనితో మాట్లాడిన సందర్భం ఇంకా గుర్తుంది. అతని మాటల్లో స్పష్టత.. సెట్స్ లో తన ప్రవర్తన అంతా చూస్తే ఈ బోయ్ లో ఏదో స్పార్క్ ఉందని అనిపించింది. జాతిరత్నాలు సినిమాలో అతని అద్భుత నటన చూసి నా మతి చెడింది“ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు సూపర్ స్టార్. జాతిరత్నాల్లో ఆ రత్నమే వేరంటూ మహేష్ ఇచ్చిన కాంప్లిమెంట్ ని బహుశా నవీన్ తన జీవితాంతం మర్చిపోలేరేమో. తదుపరి అతడు మహేష్ నిర్మించనున్న ఓ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసినదే.