Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘యానిమల్’ గా రణబీర్..సందీప్ రెడ్డి

‘యానిమల్’ గా రణబీర్..సందీప్ రెడ్డి


‘అర్జున్ రెడ్డి..’ తెలుగు సినిమాా ఇండస్ట్రీలో ఓ సంచలనం. 2017లో సందీప్ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రంలో హీరో విజయ్ దేవరకొండను చూపించిన విధానానికి యూత్ ఫుల్ అట్రాక్ట్ అయ్యింది. ఈ చిత్ర విజయంతో బాలీవుడ్ దృష్టిని కూడా తనవైపు తిప్పుకున్నాడు. ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని హిందీలో ‘కబీర్ సింగ్’గా రీమేక్ చేసి అక్కడ కూడా సక్సెస్ రిపీట్ చేశాడు. దీంతో.. బాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయ్యాడు సందీప్.

రణబీర్ తో ఛాన్స్..
షాహిద్ కపూర్-కియారా అద్వానీతో రీమేక్ చేసిన ‘కబీర్ సింగ్’ బాలీవుడ్ లో దుమ్ములేపింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 278.24 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో.. బాలీవుడ్ స్టార్స్ సందీప్ డైరెక్షన్ లో సినిమా చేయడానికి ఆసక్తి చూపించారు. ఈ క్రమంలోనే రణబీర్ కపూర్ హీరోగా ఓ ప్రాజెక్టు ప్రకటించాడు సందీప్. ఈ చిత్రానికి ‘డెవిల్’ అని పేరు కూడా పెట్టారు. అయితే.. ఇప్పుడు ఆ టైటిల్ ను మార్చేశారట.

టైటిల్ ఇవ్వనన్న నడియావాలా..
‘డెవిల్’ టైటిల్ ను ప్రొడ్యూసర్ సాాజిద్ నడియావాలాా గతంలోనే రిజిస్టర్ చేయించారట. దీంతో.. ఆ టైటిల్ ను తమకు ఇవ్వాలని కోరిందట సందీప్ టీం. అయితే.. ఈ రిక్వెస్ట్ కు ఒప్పుకోలేదట సాజిద్. సల్మాన్ ఖాన్ తో రూపొందించిన ‘కిక్’ చిత్రానికి సీక్వెల్ తీయబోతుండడంతో.. ఆ చిత్రం కోసం ‘డెవిల్’ టైటిల్ ను నడియావాలా రిజిస్టర్ చేయించాారట. దీంతో టైటిల్ ను మార్చక తప్పలేదు.

‘యానిమల్’ గా రణబీర్..
చిత్ర నిర్మాతలు భూషణ్ కుమార్ మురాద్ ఖేతానీలను లాస్ట్ వీక్ కలిసిన డైరెక్టర్ సందీప్.. ‘డెవిల్’ను ‘యానిమల్’గా మార్చేద్దామని చెప్పారట. ఈ విషయాన్ని ముంబై మీడియా వెల్లడించింది. కాగా.. ఈ చిత్రం గ్యాంగ్స్టర్ డ్రామా తెరకెక్కుతుందని టాక్.

ఆ చిత్రాల తర్వాతే..
‘యానిమల్’కు ముందు రంజన్ డైరెక్షన్ లో నటిస్తున్న చిత్రాన్ని రణబీర్ పూర్తిచేస్తారని సమాచారం. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ జనవరి 6 న ప్రారంభమై జనవరి 14 తో ముగుస్తుంది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం షూట్ మే 2021 నాటికి పూర్తవుతుందని ఆ తర్వాత రణబీర్ ‘యానిమల్’కు వెళతారు. మరి ఈ చిత్రంలో రణబీర్ ను సందీప్ రెడ్డి ఎలా చూపిస్తాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.