Templates by BIGtheme NET
Home >> Cinema News >> రేర్ పిక్: ఎన్టీఆర్ తో .. మెగాస్టార్ ఫ్యామిలీ..

రేర్ పిక్: ఎన్టీఆర్ తో .. మెగాస్టార్ ఫ్యామిలీ..


తెలుగు సినిమా చరిత్ర 1960 నుంచి ఊపందుకుంది. అంతకు ముందు కొన్ని సినిమాలు వచ్చినా.. ఆ తరం నుంచి ఉన్న నటీనటులే మూడు నాలుగు దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలేశారు. ఆ తరంలో దివంగత విశ్వవిఖ్యాత నటసౌర్వభౌమ ఎన్టీఆర్ తిరుగులేని స్టార్ హీరోగా నిలిచారు. ఎన్టీఆర్ తెలుగులోనే సినిమాలు చేసినా ఆయన ప్రభావం ఇటు సౌత్లో అన్ని భాషలతో పాటు అటు హిందీలోనూ ఎక్కువుగా ఉండేది. ఎన్టీఆర్ కేవలం సినిమాల్లో స్టార్ హీరోగా వెలుగొందడమే కాకుండా.. తర్వాత రాజకీయాల్లోకి వచ్చి అప్పటి వరకు తిరుగులేని ఐరన్లేడీగా దేశ రాజకీయాలను శాసిస్తోన్న ప్రధానమంత్రి ఇందిరాగాంధీని సైతం ఢీ కొట్టి నిలవడంతో ఆయన క్రేజ్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది.

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక ఆ ప్లేస్ను మెగాస్టార్ చిరంజీవి భర్తీ చేశారు. 1990వ దశకం నుంచి చిరంజీవి హవా స్టార్ట్ అయ్యింది. ఇక ఎన్టీఆర్ – చిరంజీవి కాంబినేషన్లో కూడా ఒక సినిమా వచ్చింది. చిరంజీవి మామ ప్రముఖ కమెడియన్ అల్లు రామలింగయ్య – ఎన్టీఆర్ కాంబినేషన్లో ఎన్నో హిట్ సినిమాలు వచ్చాయి. వీరిద్దరు ఎంతో స్నేహంగా ఉండేవారు. చిరంజీవితో అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖ వివాహం నిశ్చయమైనప్పుడు కూడా అల్లు రామలింగయ్య ముందుగా ఈ విషయాన్ని ఎన్టీఆర్కు చెప్పడంతో భేషైన నిర్ణయం తీసుకున్నావు బ్రదర్ అని మెచ్చుకున్నారట.

ఇక ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీపార్వతితో పాటు అటు మెగాస్టార్ దంపతులు ఓ అరుదైన సందర్భంలో కలిసిన ఫొటో ఇప్పుడు కొందరు అభిమానుల తవ్వకాల్లో బయట పడింది. ఇప్పుడు ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 1993లో నటి ఊర్వశి శారద లోటస్ చాక్లెట్స్ అనే కంపెనీని ప్రారంభించారు. ఈ చాక్లెట్స్ కంపెనీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ – లక్ష్మీపార్వతి దంపతులతో పాటు ఇటు మెగాస్టార్ – సురేఖ దంపతులు కూడా వచ్చారు. వీరు పక్క పక్కనే కూర్చొని ముచ్చటించుకుంటుండగా ఈ ఫొటో తీశారు. ఈ స్టిల్లో లక్ష్మీపార్వతి ఏదో చెపుతుండగా… ఎన్టీఆర్ చిరు సురేఖ ఆసక్తిగా వింటున్నారు.