Templates by BIGtheme NET
Home >> Cinema News >> వైరల్ అవుతున్న స్టార్ హీరోయిన్ ‘చెవిపోగులు’

వైరల్ అవుతున్న స్టార్ హీరోయిన్ ‘చెవిపోగులు’


‘ఏ మాయ చేసావే’ సినిమాతో అందరి మనసులు దోచుకున్న తమిళ బ్యూటీ సమంత. అక్కినేని కోడలిగా ప్రస్తుతం తన భర్త నాగచైతన్యతో వివాహ జీవితం ఎంజాయ్ చేస్తోంది. సమంత నాగచైతన్య హాష్ అనే పెట్ ని పెంచుకుంటున్నారు. ఈ లాక్ డౌన్ అంతా దాని ఆలనాపాలనా మొత్తం వీరిద్దరే చూసుకుంటున్నారు. అయితే సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ ఫుల్ యాక్టీవ్ గా ఉండే సమంత.. ఎప్పటికప్పుడు తన గురించి భర్త నాగచైతన్యలకు సంబంధించి ఏదొక పోస్ట్ పెడుతూనే ఉంటుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాల పరంగా మంచి ఫామ్ లో ఉన్న సామ్.. ఫిట్నెస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అయితే ఓ బేబీ సినిమా విజయం సాధించిన తరువాత సమంత ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. ఇంతవరకు సమంత తరువాత ప్రాజెక్టు గురించి పక్కన పెడితే ఇప్పడు సమంత ఏం చేసినా సోషల్ మీడియాలో సంచలనమే అవుతోంది.

లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అయిన సమంత సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ తను కొత్తగా ఏం చేసిన వెంటనే అభిమానులతో పంచుకుంటుంది. ఇక సమంత ఇటీవల ఈషా అనే యోగాసనం తన భర్తతో ప్రాక్టీస్ చేస్తోన్నట్లు తెలిపింది. ఇక తాజాగా అమ్మడు చెవి కమ్మలు కుట్టించుకుని సోషల్ మీడియాలో ఫోటో పోస్ట్ చేసింది. కొత్తగా చెవులు కుట్టించాను అంటూ కాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా.. సినిమాల పరంగా అమ్మడు తెలుగులో చివరిగా ‘జాను’ సినిమాలో కనిపించింది. ఆ సినిమాలో తన నటనకు ప్రశంసలు దక్కినా సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. తెలుగుతో పాటు ఈ భామ తమిళ ఇండస్ట్రీలో మంచి స్టార్డం సంపాదించుకుంది. తాజాగా తెలుగులో ఇంకా ఏ ప్రాజెక్ట్ ఓకే చేయలేదని తెలుస్తుంది. అయితే తమిళంలో మాత్రం విజయ్ సేతుపతి నయనతారలతో కలిసి ‘కత్తువకుల రెండు కాదల్’ అనే సినిమాలో కనిపించనుంది. ఆ సినిమాను నయనతార ప్రియుడు విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేయనున్నాడు.