టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా తరువాత మహేష్ చేయబోయే కొత్త సినిమా ‘సర్కారు వారి పాట’ ప్రకటన సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్బంగా ప్రకటించడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఇక గీతగోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ కొత్త సినిమా టైటిలే ఆసక్తికరంగా నిలిచింది. ఈ సినిమాతో మహేష్ బాబు మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధం అవుతున్నాడు. టైటిల్ అయితే అందరి అంచనాలు అందుకుందని చెప్పవచ్చు. కానీ పరశురామ్ – మహేష్ బాబుల కాంబినేషన్ ఎలా ఉండబోతుందా అనే సందేహిస్తున్నారు. చిత్ర యూనిట్ విడుదల చేసిన టైటిల్ పోస్టర్లకు ప్రేక్షకుల నుండి అనూహ్యమైన స్పందన లభించింది. అయితే అసలు విషయం ఏంటంటే.. సూపర్ స్టార్ మహేష్ బాబు 27వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా తెలుగు వరకే అంకితమా అనేది ప్రశ్న.
మహేష్ బాబుకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా ఎక్కువ ఫాలోయింగ్ కలిగిన టాలీవుడ్ హీరో ఆయన ఒక్కడే. అయితే మరి ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకొని అయినా ఈసారి సర్కారు వారి పాట సినిమాను పాన్ ఇండియా రేంజిలో తెరకెక్కిస్తారా..? లేక తెలుగు వరకే పరిమితం చేస్తారా..? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందా అనే సందేహం అందరిలో నెలకొంది. కాగా ఈ సినిమా ఆర్థిక నేరాల బ్యాక్డ్రాప్తో బ్యాంకు చుట్టూ తిరుగుతుందని టాక్ అయితే ఉంది. ఇక తెలుగు వరకే టార్గెట్ చేసినట్లయితే ఏమోగానీ.. పాన్ ఇండియా మూవీగా రూపొందించే ఆలోచన ఉంటే గనక అందులో నమ్రత ఇన్వాల్వ్మెంట్ తప్పక ఉంటుందని అంటున్నారు. ఇక డైరెక్టర్ పరశురామ్ ఇప్పటివరకు తెలుగు వరకే తన సినిమాలను పరిమితం చేసాడు. మరి పాన్ ఇండియా మూవీ అయితే ఆ రేంజిలో తెరకెక్కించే కెపాసిటీ ఆయనకు ఉందా..? అంటూ నెటిజన్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి సర్కార్ టీమ్ ఏం చేయనున్నారో..!