Templates by BIGtheme NET
Home >> Cinema News >> బాబోయ్ కరోనాతో వేదాంతం వలిస్తున్న తమన్నా

బాబోయ్ కరోనాతో వేదాంతం వలిస్తున్న తమన్నా


Tamanna comments On Pandemic Disease

Tamanna comments On Pandemic Disease

కరోనా వల్ల మానవత్వం మంట కలిసిందని సొంత వారే కరోనా భయంతో పట్టించుకునే పరిస్థితి లేదంటూ మీడియాలో వార్తలు చూస్తున్నాం. నడి రోడ్డు మీద శవాలను వదిలేసి వెళ్తున్న వారు.. కుటుంబ సభ్యులు కరోనా మృతదేహంకు అంత్య క్రియలు చేసేందుకు ముందుకు రాకపోవడం వంటి ఘటనలు చూస్తుంటే మనసుకు కష్టంగానే ఉంటుంది. కాని ఈ సంఘటనలు అన్ని చూసి మిల్కీ బ్యూటీ వేదాంతం చెప్పడం మొదలు పెట్టింది. ఆమె మరీ వేదాంత దోరణిలో మాట్లాడుతూ ఉండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇటీవల ఒకానొక సందర్బంగా తమన్నా.. కరోనా తో జనాలు గుణపాఠం నేర్చుకోవాలి. కాని జనాలు మాత్రం ఇంకా మూర్ఖంగా తయారు అవుతున్నారు. కరోనా కష్ట కాలంలో ఒకరికి ఒకరు తోడుగా ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకుంటూ ఉండాలి. కాని కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులు మరియు ఫొటోలు చూస్తుంటే సమాజంలో ఇలాంటి వారు ఉన్నారేంటో అనిపిస్తుంది. సోషల్ మీడియాలో కొందరు సృష్టిస్తున్న పుకార్ల కారణంగా జనాలు భయాందోళనకు గురి అవుతున్నారంది.

సెలబ్రెటీలు మరియు నాయకులు ముందుకు వచ్చి జనాలకు ధైర్యం చెప్పడంతో పాటు సోషల్ మీడియాలోని పుకార్లకు చెక్ పెట్టవచ్చు కదా అంటూ ప్రశ్నిస్తుంది. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరు పాజిటివ్ గా ఆలోచించాలని ఏమాత్రం ఆందోళన చెందకుండా దైర్యంగా తోటి వారికి ధైర్యం చెబుతు ఉండాలంటూ సూచించింది. కరోనా గురించి నెగటివ్ గా కంటే పాజిటివ్ గా ఆలోచించడం వల్ల ప్రయోజనం ఉంటుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇలాంటి వేదాంత మాటలు మిల్కీ బ్యూటీ నోటి నుండి వింటూ ఉంటే కాస్త విడ్డూరంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.