Templates by BIGtheme NET
Home >> Cinema News >> రాజమౌళి చేతుల మీదుగా వారికి సన్మానం

రాజమౌళి చేతుల మీదుగా వారికి సన్మానం


కరోనా వ్యాప్తి చెందకుండా ప్రయత్నాలు చేయడంతో పాటు కరోనాతో బాధపడుతున్న వారి కోసం ప్లాస్మాను సేకరించేందుకు కూడా సైబరాబాద్ పోలీసులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ప్లాస్మా దానంపై అవగాహణ కల్పించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో ప్లాస్మా దానం చేయడం అంటే మరొకరి ప్రాణం పోయడం అనే విషయాన్ని అవగాహణ కల్పిస్తూ చాలా మందితో ఇప్పటికే ప్లాస్మా దానం చేయించారు. ప్లాస్మా దాతలకు ప్రోత్సాహకంగా ఇప్పటికే చిరంజీవితో సన్మానం చేయించిన సజ్జనార్ ఈసారి రాజమౌళి మరియు కీరవాణిలతో సన్మానం చేయించారు.

కరోనా బారిన పడ్డ రాజమౌళి కుటుంబం నెగటివ్ వచ్చిన వెంటనే ప్లాస్మాను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. తాజాగా సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో ప్లాస్మా దానం చేసిన డోనర్స్ కు రాజమౌళి చేతుల మీదుగా సన్మానం చేయించారు. ఈ కార్యక్రమంలో రాజమౌళి కీరవాణి మరియు రమా రాజమౌళి కూడా పాల్గొన్నారు. ఇదే సమయంలో కీరవాణి పాడిన ప్లాస్మా దానం అవగాహణ పాటను కూడా ఆవిష్కరించారు. ప్లాస్మా దానం విషయంలో రాజమౌళి కుటుంబ సభ్యులు చూపిస్తున్న అసక్తిపై సీపీ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్బంగా రాజమౌళి మరియు కీరవాణిలు కరోనాను జయించిన ప్రతి ఒక్కరు ప్లాస్మాను దానం చేసేందుకు ముందుకు రావాలంటూ విజ్ఞప్తి చేశారు.