Templates by BIGtheme NET
Home >> Cinema News >> మ‌ళ్లీ రంగంలోకి దిగుతున్న క్రేజీ కాంబినేష‌న్‌

మ‌ళ్లీ రంగంలోకి దిగుతున్న క్రేజీ కాంబినేష‌న్‌


కొన్ని కాంబినేష‌న్‌లు అభిమానుల్లో ప్ర‌త్యేకత‌ను సంత‌రించుకుంటుంటాయి. అలాంటి క‌ల‌యిక‌లో మ‌ళ్లీ మ‌రో సినిమా రావాల‌ని ఆశ‌గా ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు అలాంటి క్రేజీ కాంబినేష‌నే మళ్లీ సెట్ కాబోతోందా?.. అభిమానుల్ని స‌ర్ ప్రైజ్ చేయ‌బోతోందా? అంటే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. వివ‌రాల్లోకి వెళితే.. విక్ట‌రీ వెంక‌టేష్‌, యంగ్ హీరో నాగ‌చైత‌న్య మామా అల్లుళ్లు అన్న విష‌యం తెలిసిందే. వీరిద్ద‌రు క‌లిసి తొలి సారి చేసిన సినిమా ‘వెంకీమామ‌’.

బాబి రూపొందించిన ఈ మూవీ ద‌గ్గుబాటి, అక్కినేని అభిమానుల్ని స‌ర్ ప్రైజ్ చేసింది. ఈ ఇద్ద‌రు క‌లిసి ‘ప్రేమ‌మ్‌’ లో మామా అల్లుళ్లుగా నటించారు. ఇద్ద‌రి మ‌ధ్య కుదిరిన కెమిస్ట్రీ, వెంకీ డీన్‌తో మాట్లాడే స‌న్నివేశాల్లో చేసిన‌ హ‌డావిడీ సినిమాకు ప్ర‌ధాన హైలైట్‌గా నిలిచాయి. దీని త‌రువాత పూర్తి స్థాయి పాత్ర‌ల్లో మామా అల్లుళ్లుగా వెంకీ, చైతూ క‌లిసి న‌టించిన తొలి సినిమా ‘వెంకీమామ‌’. ఇందులో ఇద్ద‌రిని వెండితెర‌పై చూసి అక్కినేని అభిమానులు, ద‌గ్గుబాటి ఫ్యాన్స్‌ హ్యాపీగా ఫీల‌య్యారు. బాగా ఎంజాయ్ చేశారు. మ‌ళ్లీ నాలుగేళ్ల విరామం త‌రువాత ఈ క్రేజీ మామా అల్లుళ్లు క‌లిసి మ‌రో సినిమాకు రెడీ అవుతున్నార‌ని తెలిసింది.

ఈ మూవీని కోలీవుడ్ నిర్మాత, స్టూడియో గ్రీన్ అధినేత కె.ఇ.జ్ఞాన‌వేల్ రాజా నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. సురేంద‌ర్ రెడ్డి డైరెక్ట్ చేయ‌నున్న ఈ సినిమాలో ఇద్ద‌రు హీరోల‌కు స్కోప్ ఉండ‌గా సీనియ‌ర్‌గా వెంక‌టేష్‌ని ఫైన‌ల్ చేసుకున్నార‌ని తెలిసింది. ఇక మ‌రో కీల‌క పాత్ర కోసం నాగ‌చైత‌న్య అయితే బాగుంటుంద‌ని సురేంద‌ర్‌రెడ్డి ప్లాన్ చేస్తున్నార‌ట‌. చైతూ దాదాపుగా ఖ‌రారు అయిన‌ట్టేన‌ని తెలుస్తోంది. చైతూ ప్ర‌స్తుతం చందూ మొండేటితో సినిమా చేస్తున్నాడు. వెంకటేష్ ‘సైంధ‌వ్‌’ని పూర్తి చేసి డిసెంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాడు. వీటి త‌రువాతే వ‌చ్చే ఏడాది ఈ క్రేజీ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవ‌కాశం ఉంద‌ని, భూప‌తిరాజా క‌థ అందిస్తున్నార‌ని తెలిసింది.