Templates by BIGtheme NET
Home >> Cinema News >> విజయ్ దేవరకొండ మరో పొలిటికల్ టచ్!

విజయ్ దేవరకొండ మరో పొలిటికల్ టచ్!


విజయ్ దేవరకొండ టైగర్ ఖుషి సినిమాలు రెండు కూడా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయాయి. ఖుషి పరవాలేదు అనిపించినప్పటికీ, లైగర్ మాత్రం కంటెంట్ పరంగాను అలాగే కమర్షియల్ గాను చాలా దారుణమైన రిజల్ట్ను అందించింది. దీంతో విజయ్ దేవరకొండ తదుపరి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు.

ఇక నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫ్యామిలీ స్టార్ 2024 సంక్రాంతికి రాబోతున్న విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను దిల్ రాజు ఎస్విసి ప్రొడక్షన్లో నిర్మిస్తున్నారు. అలాగే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కూడా విజయ్ మరో కొత్త ప్రాజెక్టు స్టార్ట్ చేశాడు. అయితే ప్రస్తుతం మాత్రం అతని ఫోకస్ ఎక్కువగా ఫ్యామిలీ స్టార్ పైనే ఉంది.

ఎందుకంటే ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. విడుదలకు ఇంకా చాలా తక్కువ సమయం ఉండడంతో విజయ్ దేవరకొండ గ్యాప్ లేకుండా ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నాడు.

ఇక దిల్ రాజు ప్రొడక్షన్లో విజయ్ దేవరకొండ మరో సినిమా చేసేందుకు కూడా ఒప్పుకున్నాడు. కొత్త దర్శకుడు రవి కిరణ్ చెప్పిన కథకు విజయ్ మొదటి సిట్టింగ్ లొనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయంలో కూడా ఒక టాక్ వైరల్ గా మారుతుంది. రస్టిక్ కమర్షియల్ ఫార్మాట్ లోనే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇందులో పొలిటికల్ టచ్ కూడా ఉంటుందట. లోకల్ గానే నేషనల్ లెవెల్ పాలిటిక్స్ ను హీరో టచ్ చేస్తాడట. గతంలో విజయ్ దేవరకొండ నోట అనే పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లో ఒక సినిమా చేశాడు.

అయితే ఆ సినిమా దారుణంగా డిజాస్టర్ అయ్యింది. ఇక మళ్ళీ ఇప్పుడు విజయ్ పొలిటికల్ అంశాలతో మరో సినిమా చేయబోతున్నాడు. మరి ఈసారి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. అలాగే విజయ్ దేవరకొండ గతంలో సుకుమార్ తో కూడా ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే. ర్యాంపేజ్ అంటూ వీరి కలయికపై అధికారికంగా తెలియజేశారు కూడా. అనంతరం ఆ కాంబినేషన్ పై మరొక క్లారిటీ రాలేదు. ప్రస్తుతం సుకుమార్ పుష్ప 2తో బిజీగా ఉన్నాడు ఆ తర్వాత రామ్ చరణ్తో సినిమా చేయబోతున్నాడు. మరి విజయ్ తో ఎప్పుడు చేస్తాడో చూడాలి.