Templates by BIGtheme NET
Home >> Telugu News >> వాహనదారులకు శుభవార్త చెప్పిన కేంద్రం ..ఏంటంటే ?

వాహనదారులకు శుభవార్త చెప్పిన కేంద్రం ..ఏంటంటే ?


మీ ఇంట్లో కారు కానీ బైక్ కానీ ఏదైనా ఉందా ! అయితే మీకు కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. వాహనదారులకు ఊరట కలిగించే ఓ కీలక ప్రకటన చేసింది. వాహనాల డాక్యుమెంట్ల వాలిడిటీని పొడిగిస్తూ కేంద్రం నిర్ణయాన్ని ప్రకటించింది. మోదీ సర్కార్ తాజాగా మోటార్ వెహికల్ డాక్యుమెంట్లు అయిన వెహకల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఫిట్ నెస్ సర్టిఫికెట్ సహా ఇతర వెహికల్ డాక్యుమెంట్ల వాలిడిటీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

2020 డిసెంబర్ 31 వరకు ప్రభుత్వం గడువు పొడిగించింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మోదీ సర్కార్ తాజా నిర్ణయంతో వాహనదారులకు తప్ప్పలు తప్పనున్నాయి. తాజా నిర్ణయంతో ప్రజలకు డాక్యుమెంట్ల రెన్యూవల్ కు ఎక్కువ గడువు అందుబాటులోకి వస్తుంది.

క్లారిటీ గా చెప్పాలంటే వెహికల్ డాక్యుమెంట్లు ఏమైనా ఎక్స్ పైరీ అయ్యి ఉంటే.. ఇప్పుడు అవే డాక్యుమెంట్లు డిసెంబర్ 31 వరకు చెల్లుబాటు అవుతాయి. అంటే ఈ ఏడాది లోపు ఎక్స్ పైరీ అయిన డాక్యుమెంట్లను రెన్యూవల్ చేసుకుంటే సరిపోతుంది. డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఎక్స్పైరీ అయ్యి ఉంటే దాన్ని కూడా డిసెంబర్ లోపు ఎప్పుడైనా రెన్యూవల్ చేసుకోవచ్చు. ఆర్టీవో ఆఫీసులో గుంపులు గుంపులుగా కాకుండా కొంచెం తక్కువగా వెళ్తారని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.