Templates by BIGtheme NET
Home >> Telugu News >> శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం, పేలుడు.. మంటల్లో చిక్కుకున్న 10మంది

శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం, పేలుడు.. మంటల్లో చిక్కుకున్న 10మంది


శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రంలో గురువారం అర్ధరాత్రి భారీ ప్రమాదం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమల పెంట దగ్గర నాలుగో యూనిట్‌ టెర్మినల్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మొత్తం ఆరు యూనిట్లలో పొగలు కమ్ముకున్నాయి. పొగలు రావడాన్ని గమనించి డీఈ పవన్‌కుమార్‌తో పాటు ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ సిబ్బంది కొందరు వెంటనే బయటకు పరుగులు తీశారు. చూస్తూ ఉండగానే కరెంటు ఉత్పత్తి నిలిచిపోయింది. షార్ట్ సర్కూట్ వల్ల ప్యానల్ బోర్డులలో ఏర్పడిన మంటలకు భారీగా పేలుడు శబ్దాలు వచ్చాయి.

ప్రమాద సమయంలో విధుల్లో సుమారు 20 మంది ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు ఏ ఈలు , 6 మంది సిబ్బంది మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతాన్ని పోలీసులు, రక్షణ సిబ్బంది తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. లోపలున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.మంత్రి జగదీష్ రెడ్డి, సీఎండీ ప్రభాకర్ రావులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఘటనా స్థలానికి నాగర్ కర్నూల్ కలెక్టర్ శర్మన్ చేరుకున్నారు. అక్కడే చిక్కుకుపోయిన సిబ్బందిని కాపాడానికి ప్రయత్నిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రమాదంలో గాయపడ్డవారికి చికిత్స అందిస్తున్నామన్నారు.

ప్రమాదంతో దట్టమైన మంటలు, పొగ అలముకోవడంతో 10మంది సిబ్బంది బయటికి రాలేక పవర్ హౌస్లో చిక్కుకుపోయారు. చిక్కుకుపోయిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.
1) శ్రీనివాస్ DE
2) వెంకట్రావు AE
3) ఫాతిమా బేగం AE
4) మోహన్ AE
5) సుందర్ AE
6) రాంబాబు PA
7) కిరణ్ AE
ఇద్దరు ప్రవేట్ వ్యక్తులు హైదరాబాద్ కుచెందిన బ్యాటరీ రిపేరర్లు.