Templates by BIGtheme NET
Home >> Telugu News >> కరోనా వల్ల సింహం మలానికి భలే గిరాకీ..

కరోనా వల్ల సింహం మలానికి భలే గిరాకీ..


ఔను, మీరు చదివింది కరక్టే. సింహం మలం హాట్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతోంది. జనాలు ఎగబడి మరీ దీన్ని కొనుగోలు చేస్తున్నారు. వామ్మో.. వాళ్లకు ఏమైనా పిచ్చా? సింహం మలాన్ని వాళ్లు ఏం చేసుకుంటారు? కొంపదీసి తినేయరు కదా అనేగా మీ సందేహం. మీ డౌటానుమలన్నీ తీరాలంటే.. జర్మనీలో క్రోనే సర్కస్ కంపెనీవాళ్లు మొదలుపెట్టిన ఈ కొత్త బిజినెస్ గురించి తెలుసుకోవల్సిందే.

జోక్‌గా మొదలై..
ముంచీలో గల క్రోనే సర్కర్.. కరోనా వైరస్ వల్ల నష్టాల్లో కూరుకుపోయింది. గత కొన్ని నెలలుగా సర్కస్ ప్రదర్శనలు జరగకపోవడం వల్ల అందులోని ఉద్యోగులు పస్తులుంటున్నారు. అంతేగాక.. సర్కస్‌లో ఉండే జంతువులకు సైతం ఆహారం పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఈ కఠోర సమయంలో ఏం చేయాలా అనే ఆలోచిస్తున్న సమయంలో ఓ ఉద్యోగి.. ‘‘సింహం మలాన్ని అమ్ముకుందాం’’ అని జోక్ చేశాడు. అతడు ఆ మాటను సరదాగానే అన్నాడు. కానీ, సర్కస్ నిర్వాహకులు మాత్రం దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఇంకేముంది.. సింహం మలాన్నీ జాడీల్లో పెట్టి అమ్మకాలు మొదలుపెట్టారు.

ఏకంగా షాప్ పెట్టేశారు
‘‘రండి బాబు.. రండి.. మా వద్ద ఫ్రెష్ సింహం పూప్ (మలం) లభిస్తోంది. వచ్చి కొనుక్కోండి.. మీ ప్రాణ మిత్రులకు బహుమతిగా ఇవ్వండి’’ అని ప్రచారం చేశారు. ఇంకేముంది.. ఇదేదో క్రేజీగా ఉందే అని జనాలు సింహం మలాన్ని కొనుగోలు చేయడానికి క్యూకట్టారు. దీనికి డిమాండ్ పెరగడంతో సర్కస్ వాళ్లు మలం గుర్తు(పూ ఎమోజీ)తో ప్రత్యేకంగా ఓ దుకాణాన్ని కూడా ప్రారంభించారు. అందులో సింహం మలంతో కూడిన జాడీలను వరుసగా పేర్చి కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు.

ఎందుకు కొంటున్నారంటే..
ఈ సర్కస్‌లో మొత్తం 26 సింహాలు, పులులు ఉన్నాయి. ఒక్కో సింహం మలం జాడీని 5 యూరోలు (రూ.445)లకు అమ్ముతున్నారు. వాస్తవానికి సింహం మలాన్ని వీరు ఉత్తినే అమ్ముతున్నారు. అందులో ఎలాంటి ప్రత్యేకతలు లేవు. అయితే, ప్రజలు మాత్రం వాటిని తమ స్నేహితులకు గిఫ్టుగా పంపి ఆటపట్టేందుకు వాటిని కొనుగోలు చేస్తున్నారు. కొందరు మాత్రం.. సింహం మలాన్ని ఎరువుగా వాడేందుకు కొనుగోలు చేస్తున్నారు. సింహం మలంలో క్రిమీసంహాకరంగా పనిచేస్తుందని వాళ్లు చెబుతున్నారు.

అమ్మకాలు ఆపాలని డిమాండ్
ఈ సరికొత్త ప్రొడక్ట్ గురించి ఇప్పుడు ఆన్‌లైన్‌లో కూడా చర్చ మొదలైంది. దీంతో సర్కస్ సంస్థకు కాసుల వర్షం మొదలైంది. అయితే, కొందరు ఈ వ్యాపారాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. సింహం మలంలో బ్యాక్టీరియా ఉంటుందని, అది ప్రజారోగ్యానికి హానికరమని ఆరోపిస్తున్నారు. వెంటనే సింహం మలాన్ని విక్రయించే సంస్థపై చర్యలు తీసీకోవాలని, అమ్మకాలను ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, జనం మాత్రం దీన్ని తాము సరదాగా కోసమే కొనుగోలు చేస్తున్నామని, దీనివల్ల సర్కస్ సంస్థవారికి ఆర్థిక చేయుత లభించడమే కాకుండా.. ఆ జంతువులకు మంచి ఆహారాన్ని అందించగలరని అంటున్నారు. సింహం మలాన్ని ఎలా విక్రయిస్తున్నరనేది ఈ కింది వీడియోలో చూడగలరు.