Templates by BIGtheme NET
Home >> Telugu News >> ఏపీలో న్యూ ఇయర్ కిక్ ఉంటుంది..! కానీ అవే బ్రాండ్లు..!

ఏపీలో న్యూ ఇయర్ కిక్ ఉంటుంది..! కానీ అవే బ్రాండ్లు..!


కరోనా సెకండ్ వేవ్ వస్తోందని.. డిసెంబర్ ఇరవై ఆరు నుంచి జనవరి ఒకటో తేదీ వరకూ ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించినట్లుగా ప్రకటించింది. కానీ.. కొత్త సంవత్సర వేడుకకు కిక్ ఇచ్చే విషయంలో మాత్రం ఎలాంటి నిబంధనలు పెట్టుకోలేదు. రెండు రోజులు అంటే.. డిసెంబర్ 31, జనవరి ఒకటో తేదీన ప్రభుత్వ మద్యం దుకాణాలనన్నింటినీ మూసివేస్తారన్న ప్రచారం జరిగింది. మద్యపానానికి వ్యతిరేకమైన ప్రభుత్వం ఆదాయం గురించి పట్టించుకోకుండా.. ఆ పని చేస్తుందని అనుకున్నారు. కానీ.. మద్యం దుకాణాలు మూసివేయడం కానీ.. సమయాలను తగ్గించడం కానీ చేయడం లేదు.

కొత్త సంవత్సర వేడుకలకు యధావిధిగా తెరుచుకోనున్న మద్యం దుకాణాలు, బార్లు తెరుచుకుంటాయని ప్రభఉత్వం స్పష్టత ఇచ్చింది. దుకాణాలు, బార్లపై నిషేధం లేదని తెలిపింది. మద్యం దుకాణాలు రాత్రి తొమ్మిది గంటల వరకు… బార్లు రాత్రి పది గంటల వరకూ ఉంటాయని స్పష్టత ఇచ్చింది. దీంతో నయాసార్ జోష్‌ను అస్వాదించాలనుకునే మందుబాబులకు కాస్త ఊరట లభించినట్లయింది. లేకపోతే.. పొరుగు రాష్ట్రాలకు పరుగులు పెట్టి… అక్కడే న్యూ ఇయర్ కు వెల్కం చెప్పేందుకు ప్లాన్ చేసుకునేవారు. అయితే.. బ్రాండ్లు మాత్రం… ఎప్పటివే దొరుకుతాయి. అందుకే.. ప్రెసిడెన్షియల్ మెడల్, ఆంధ్రాగోల్డ్… చుబుషూ బీర్ లాంటివన్నమాట. వాటితోనే సరిపెట్టుకోవాలి. వర్జినల్ బ్రాండ్లు కోసం అయితే పక్క రాష్ట్రాలకు పోవాల్సిందే.

తమ ప్రభుత్వానికి మద్యం ఆదాయ వనరు కాదని చెబుతూ వస్తున్న ప్రభుత్వం ఇటీవల తన విధానాన్ని మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. మద్యందుకాణాల సమయాన్ని పెంచడం… రేట్లు తగ్గించడం.. వంటి సంస్కరణలు చేపట్టింది.ఇక.. మద్యం వినియోగాన్ని పెంచే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఇంత కాలం.. మద్యం నిషేధం చేస్తామని.. చెబుతూ వచ్చిన ప్రభుత్వం.. అనూహ్యమైన నిర్ణయాలు తీసుకోవడం ఆదాయం కోసమేనని అంచనా వేస్తున్నారు. కొత్తగా తీసుకుంటున్న అప్పులకు మద్యం ఆదాయాన్ని గ్యారంటీగా పెడుతున్నారు అంటే.. ఇక మద్య నిషేధం అనే మాటే వినిపించకపోవచ్చంటున్నారు.