Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఈ గ్లామర్ బ్యూటీకి మాత్రమే 2020 బాగా కలిసొచ్చిందట!!

ఈ గ్లామర్ బ్యూటీకి మాత్రమే 2020 బాగా కలిసొచ్చిందట!!


యంగ్ హీరోయిన్ కియారా అద్వానీ.. పేరు ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలోని అందరి నోళ్ళలో తెగ నానుతుంది. ఎందుకంటే ఆమె ఎంచుకుంటున్న సినిమాలు కియారాకు అలాంటి క్రేజ్ తీసుకొస్తున్నాయి. ఈ మధ్యకాలంలో కియారా మరీ బోల్డ్ గా తయారైంది. ఎంతగా అంటే అందాల ఆరబోతతో పాటు శృంగార సన్నివేశాలలో కూడా రాజీపడట్లేదు. అమ్మడు సినిమాలతోనే కాదు ఫోటోషూట్లతో కూడా సోషల్ మీడియాను వేడెక్కిస్తుంది. అయితే కియారాకి ఈ ఏడాది బాగా కలిసి వచ్చిందట. అందరు సినీతారల విడుదలలు మహమ్మారి వలన ఆగిపోతే.. కియారా సినిమాలు మాత్రం థియేటర్లలో ఓటిటి వేదికలలో విడుదల అవుతూనే ఉన్నాయి. ప్రెసెంట్ ఇండస్ట్రీ దృష్టంతా కియారా పైనే ఉండటంతో ఇదే సరైన సమయం అని అమ్మడు బోల్డ్ ప్రకటనలు ప్రకటిస్తుంది. ఇప్పటికే కబీర్ సింగ్.. లస్ట్ స్టోరీస్ లతో పాటు గిల్టీ వెబ్ సిరీస్ లో కూడా అలాంటి పాత్రే చేసింది.

ఇక ఈ సినిమాలలో అమ్మడు పండించిన రొమాన్స్ చూసి ఫిదా అయినవారిలో స్టార్ హీరోలు దర్శక నిర్మాతలు కూడా ఉన్నారు. ఈ ఏడాది కియారా నుండి ఓటిటిలో “గిల్టీ” “లక్ష్మి” చిత్రాలు విడుదలయ్యాయి. అలాగే ఈ నెలలో “ఇందూకి జవానీ” విడుదలై థియేటర్లలో ఆడుతోంది.2014 లో “ఫగ్లీ” సినిమాతో బాలీవుడ్ తన ప్రయాణాన్ని ప్రారంభించిన కియారా.. ఎంఎస్ ధోని: ది అన్టోల్డ్ స్టోరీ కబీర్ సింగ్ గుడ్ న్యూజ్ లతో పాటు లస్ట్ స్టోరీస్ అనే డిజిటల్ వెబ్ సిరీస్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. అయినా ఈ భామకు ప్రస్తుతం రెస్ట్ అవసరం లేదంట. “నేను ఇంకా ఎంతో ఆసక్తిగా ఉన్నాను. నేను కంటెంట్ చూసే రకం కాదని అనుకోను – ఎప్పుడూ ముందుకు సాగాలని మాత్రమే కోరుకునే రకం. నేనిదే రకం” అంటూ తన గురించి మరో బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేసింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అమ్మడి చేతిలో మూడు బాలీవుడ్ సినిమాలు ఉన్నాయట. అవి సిధార్థ్ మల్హోత్రా సరసన షెర్షా కార్తీక్ ఆర్యన్ తో ‘భూల్ భూలైయా 2’ అలాగే వరుణ్ ధావన్ సరసన ‘జగ్ జగ్ జీయో’ మూవీస్ ఉన్నట్లు తెలుస్తుంది.