Templates by BIGtheme NET
Home >> Cinema News >> మీటూ వ్యాఖ్యలు చేసింది.. పార్టీలో చేరి ఉపాధ్యక్షురాలు అయ్యింది

మీటూ వ్యాఖ్యలు చేసింది.. పార్టీలో చేరి ఉపాధ్యక్షురాలు అయ్యింది


సౌత్ తో పాటు నార్త్ లో కూడా పలు సినిమాల్లో నటించిన పాయల్ ఘోష్ ఇటీవల ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ పై మీటూ అంటూ లైంగిక ఆరోపణలు చేయడం ఆ సమయంలో మరో హీరోయిన్ పై వ్యాఖ్యలు చేయడం వంటి కారణాలతో పాయల్ ఘోష్ ఒక్కసారిగా పాపులారిటీ దక్కించుకుంది. సినిమాల్లో అవకాశాలు తగ్గుతున్న ఈ సమయంలో మీటూ వ్యాఖ్యలతో వచ్చిన పాపులారిటీతో రాజకీయ పార్టీలో చేరిపోయింది. రాజకీయ అరంగేట్రం చేసిన పాయల్ ఘోష్ కు వెంటనే పార్టీ పదవి దక్కింది.

రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా లో పాయల్ చేరింది. కేంద్ర మంత్రి ఆ పార్టీ అధినేత అయిన రాందాస్ అథవలే సమక్షంలో పార్టీ తీర్థంను ఆమె పుచ్చుకుంది. వెంటనే పార్టీ మహిళ విభాగం ఉపాధ్యక్షురాలిగా ఆమెను నియమిస్తున్నట్లుగా రాందాస్ అథవలే ప్రకటించారు. ముంబయిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇంకా పలువురు ఆ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు హాజరు అయ్యారు. ఉన్నట్లుండి పార్టీలో జాయిన్ అవ్వడం ఏంటీ అంటూ పాయల్ ను ప్రశ్నించగా ఆమె నవ్వేసి వెళ్లి పోయింది.