Templates by BIGtheme NET
Home >> Cinema News >> షాకిచ్చే మేకోవర్ తో చాక్లెట్ బోయ్ సిద్ధార్థ్

షాకిచ్చే మేకోవర్ తో చాక్లెట్ బోయ్ సిద్ధార్థ్


శంకర్ `బాయ్స్` మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సిద్ధార్ధ్ ఆ తరువాత టాలీవుడ్ లో హాట్ త్రోబ్ గా.. లవర్ బాయ్ గా మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్నారు. `బొమ్మరిల్లు` టాలీవుడ్ లో ఏ స్థాయి సంచనం సృష్టించిందో అందరికి తెలిసిందే. జబర్దస్త్ – బాద్ షా వంటి చిత్రాల తరువాత సిద్ధార్ధ్ టాలీవుడ్ కు టాటా చెప్పేశారు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల టాలీవుడ్ కు సిద్ధార్ధ్ దూరమై దాదాపు ఎనిమిదేళ్లవుతోంది.

ఈ ఎనిమిదేళ్ల విరామం తరువాత సిద్ధార్ధ్ టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. శర్వానంద్ హీరోగా అజయ్ భూపతి రూపొందిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం `మహాసముద్రం` లో నటిస్తూ హాట్ టాపిక్ గా మారాడు. ఈ మూవీతో సిద్ధార్థ్ టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తుండడం అభిమానుల్లో చర్చకు వచ్చింది.

గత ఎనిమిదేళ్ల క్రితం ఫేడవుట్ అయిపోయిన సిద్ధార్థ్ ఒక దశలో టాలీవుడ్ లో అగ్ర కథానాయకుడిగా ఓ వెలుగు వెలిగాడు. టాలీవుడ్ హీరోలందరి మెప్పుని పొందడమే కాకుండా మెగా హీరోలు కూడా మెచ్చిన స్టార్ గా సిద్ధార్థ్ పేరు మార్మోగింది.

అనూహ్యంగా ఉవ్వెత్తున ఎగిసిన తారా జువ్వలా సంచలనం సృష్టించారు. కానీ ఆ తరువాత జరిగిన నాటకీయ పరిణామాల కారణంగా కెరీర్ పరంగా నేలకు జారిపోయాడు. అయితేనేం `మహాసముద్రం`తో తిరిగి సత్తా చాటేందుకు వస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే తారా తీరం నుంచి ఉల్కలా దూసుకొస్తున్నాడు. గతంతో పోలిస్తే లుక్ వైజ్ గా చాలా మారిపోయిన సిద్ధార్థ్ మళ్లీ మెస్మరైజ్ చేస్తాడో లేదో తెలియాలంటే `మహా సముద్రం` రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.

మహాసముద్రంలో అదితీరావు హైదరీ.. అను ఇమ్మాన్యయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.