Templates by BIGtheme NET
Home >> Cinema News >> సుశాంత్ కేసులో ఎఫ్ ఐఆర్.. ఇంట్రస్టింగ్ విషయాలు

సుశాంత్ కేసులో ఎఫ్ ఐఆర్.. ఇంట్రస్టింగ్ విషయాలు


బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యలో ఆర్థిక కోణాలు వెలుగుచూశాయి. అతడి అకౌంట్ లోని 15 కోట్ల రూపాయలు మాయం అయినట్టు సుశాంత్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుశాంత్ అకౌంట్ నుంచి రియా చక్రవర్తి ఆమె కుటుంబ సభ్యులకు భారీగా డబ్బు బదిలీ చేసుకున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఈ కేసులో ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది.

ఈ క్రమంలోనే రియా కుటుంబ సభ్యులను పిలిచి ఈడీ విచారణ చేపట్టింది. ఈ విచారణకు సంబంధించి ఈడీ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. సుశాంత్ అకౌంట్ నుంచి రియా అకౌంట్ కు.. ఆమె కుటుంబ సభ్యుల అకౌంట్లకు ఎలాంటి డబ్బూ బదిలీ కాలేదని పేర్కొన్నట్టుగా తెలుస్తోంది.

అయితే రియా ఆస్తుల విలువ గురించి మీడియాలో సంచలనమైన కథనాలు వెలువడ్డాయి. ఆమె ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టిందని ఆరోపించాయి. అంతేకాదు.. సుశాంత్ కు రియానే డ్రగ్స్ ఇచ్చి ఈ పరిస్థితికి దిగజార్చిందని వ్యాఖ్యానించారు.

అయితే ఈడీ మాత్రం ఈ కేసులో సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియాకు క్లీన్ చిట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి సుశాంత్ అకౌంట్ లోని డబ్బులు ఏమయ్యాయి? ఎటు పోయాయి అన్నది ఈడీ తేల్చాల్సి ఉంది.