Templates by BIGtheme NET
Home >> Cinema News >> హైదరాబాద్ లో వాలిపోయిన ‘పుష్ప’ విలన్..!

హైదరాబాద్ లో వాలిపోయిన ‘పుష్ప’ విలన్..!


డైరెక్టర్ సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ”పుష్ప”. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇందులో విలన్ రోల్ కోసం అనేక మందికి సంప్రదించిన అనంతరం నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్ ను ఫైనలైజ్ చేశారు. మలయాళంలో విభిన్నమైన చిత్రాలు చేస్తూ విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన ఫహాద్ ఫాజిల్.. బన్నీ సినిమాలో విలన్ గా నటిస్తుండతో అందరిలో ఆసక్తి పెరిగింది. అయితే మలయాళ నేచురల్ స్టార్ ఇంకా సెట్స్ లో అడుగుపెట్టలేదు.

పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ‘పుష్ప’ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ పార్ట్ కి సంబంధించిన మెజారిటీ భాగం షూటింగ్ కూడా పూర్తయింది అంటున్నారు. అయితే ఇంతవరకు ‘పుష్ప’ విలన్ షూటింగ్ లో జాయిన్ అవ్వకపోవడం ఏంటని అందరూ ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫహాద్ ఫాజిల్ నిన్న గురువారం హైదరాబాద్ లో దిగినట్లు వార్తలు వస్తున్నాయి.

కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల తర్వాత ఇటీవలే ‘పుష్ప’ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఈ క్రమంలో ఫహాద్ టాలీవుడ్ లో అడుగుపెట్టారు. కాకపోతే వెంటనే షూట్ లో జాయిన్ కావడం లేదని తెలుస్తోంది. సుక్కూ అండ్ టీమ్ ప్రస్తుతం విలన్ మీద లుక్ టెస్ట్ మరియు ట్రయల్ షూట్ జరుపుతున్నారట. అంతేకాదు ఫహాద్ కు తొలి తెలుగు సినిమా కావడంతో తెలుగు డైలాగులను పలకడాన్ని ప్రాక్టీస్ చేయిస్తున్నారట. అందుకే మరికొన్ని రోజుల తర్వాతే మలయాళ స్టార్ ‘పుష్ప’ సెట్ లో అడుగుపెడతారని సమాచారం. డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఫహాద్.. స్ట్రెయిట్ తెలుగు సినిమాతో ఏ మేరకు అలారిస్తారో చూడాలి.