Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఇది ఎంత మంది చూస్తారు : గీతా

ఇది ఎంత మంది చూస్తారు : గీతా


టాలీవుడ్ లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా నిలిచిన మిర్యాలగూడెం యువతి 139 మంది రేపు కేసు అనూహ్య మలుపు తిరిగింది. యాంకర్ ప్రదీప్ తో పాటు మరికొందరి పేర్లను డాలర్ బాబు బలవంతంతో చెప్పానంటూ ఆమె వెళ్లడించడంతో అంతా అవాక్కవుతున్నారు. ఈ కేసులో ప్రదీప్ ఉన్నాడు అంటూ వార్త వచ్చిన వెంటనే దావానంలో వ్యాప్తి చెందాయి. ప్రదీప్ ఆ విషయంలో మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చినా కూడా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. అయితే ప్రదీప్ అన్నట్లుగానే ఈ కేసు నుండి నిర్దోషిగా బయట పడ్డాడు. ప్రదీప్ కు ఎలాంటి సంబంధం లేదని స్వయంగా ఆమె మీడియా ముందుకు వచ్చి ప్రకటించింది.

ఈ నేపథ్యంలో మళ్లీ యూట్యూబ్ ఛానెల్స్ ప్రదీప్ అమాయకుడు అంటూ థమ్ నెయిల్స్ పెట్టి వీడియోలు పోస్ట్ చేశారు. గీతా మాదురి ఈ విషయమై స్పందిస్తూ ఆ యువతి ప్రదీప్ కు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు అంటూ చెప్పిన ఒక వీడియో థమ్ నెయిల్ షేర్ చేసి దాన్ని చూసినంత మంది ఈ వీడియోను చూస్తారా.

ఈ వీడియోను ఎంత మంది చూస్తారు అంటూ సోషల్ మీడియాలో పెట్టింది. సత్యం గెలుస్తుంది. అయితే అప్పటి వరకు ఓపిక ఉండాలంటూ ఆమె సూచించింది. ఏదైనా పుకారు వచ్చిన వెంటనే ఆలోచించకుండా హడావుడిగా ప్రచారం చేయవద్దు అనేది ఆమె ఉద్దేశ్యం. ప్రదీప్ కు ఆ కేసుతో సంబంధం ఉందనే వార్త చదివిన ప్రతి ఒక్కరు ఈ వార్తను చదివేనా అంటూ ఆమె అనుమానం వ్యక్తం చేసింది.