Templates by BIGtheme NET
Home >> Cinema News >> కోవిడ్ సిమ్టమ్స్ తో `పుష్ప` షూటింగ్ ఆగిపోయిందా?

కోవిడ్ సిమ్టమ్స్ తో `పుష్ప` షూటింగ్ ఆగిపోయిందా?


అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప` షూటింగ్ ఆగిపోయిందా?.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో ముత్యంశెట్టి మీడియా సమర్పణలో మైత్రీ మూవీమేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ కోవిడ్ కారణంగా గత ఎనిమిది నెలలుగా ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇటీవలే మారేడుమిల్లిలోని డీప్ ఫారెస్ట్ లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని చిత్ర బృందం ప్రారంభించింది.

బన్నీ మాస్ గెటప్ లో లారీ డ్రైవర్ పుష్పరాజ్ గా ఇందులో నటిస్తున్నారు. మారేడుమిల్లి సెట్ లో బన్నీ మాసిన బట్టలతో వున్న ఓ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా వుంటే ఈ మూవీ షూటింగ్ ని అర్థాంతరంగా ఆపేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లి థిక్ ఫారెస్ట్ లో జరుగుతున్న షూటింగ్ లో అంతరాయం ఏర్పడిందని ఈ షూట్ లో పాల్గొంటున్న యూనిట్ మెంబర్స్ కి కోవిడ్ సిమ్టమ్స్ కనిపించాయట. దీంతో టీమ్ అంతా ఉన్నఫలంగా ప్యాకప్ చెప్పేసి హైదరాబాద్ కు వచ్చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

షూటింగ్ సాఫీగా సాగుతున్న నేపథ్యంలో కొంత మంది యూనిట్ మెంబర్స్ కి కోవిడ్ సిమ్టమ్స్ బయటపడటంతో షూటింగ్ మధ్యలోనే ఆసేయాల్సి వచ్చిందని దీంతో దర్శకుడు సుకుమార్ అప్ సెట్ అయ్యారని చెబుతున్నారు. శేషాచలం ఫారెస్ట్ నేపథ్యంలో గంధపు చెక్కల స్మగ్లింగ్ ఆధారంగా ఈ మూవీని సుకుమార్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో సుకుమార ఆవేదనకు గురవుతున్నారట.