Templates by BIGtheme NET
Home >> Cinema News >> సెలబ్రిటీల విహారయాత్రల వెనుక అసలు రహస్యం అదేనా..?

సెలబ్రిటీల విహారయాత్రల వెనుక అసలు రహస్యం అదేనా..?


కరోనా మహమ్మారి భయంతో ఇన్నాళ్లూ ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు.. ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. సినిమా షూటింగ్ లకు హాజరవుతూ బిజీగా మారిపోతున్నారు. అలానే లాక్ డౌన్ ఎత్తేసి ప్రయాణాలకు అనుమతి లభించడంతో విహారయాత్రలకు వెళుతున్నారు. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ చాలా మంది ప్రముఖులు హాలిడే ని ఎంజాయ్ చేయడానికి మాల్దీవులకు వెళ్లారు. ప్రశాంతమైన మాల్దీవుల బీచ్ లలో ఎంజాయ్ చేస్తూ ఆ ఫొటోలతో సోషల్ మీడియాలో హల్ చేస్తున్నారు.

స్టార్ హీరోయిన్ కాజల్ కిచ్లు తన భర్తతో కలిసి హనీమూన్ కి అక్కడికే వెల్లడింది. అక్కినేని నాగచైతన్య- సమంత జంట సందడి చేసింది. మెహ్రీన్ తన ఫ్యామిలీతో కలిసి ఈ దీవుల్లో ఎంజాయ్ చేసొచ్చింది. ఇక తాప్సి అయితే అందరికంటే ముందే తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి మాల్దీవులకు వెళ్లి తిరిగొచ్చింది. షాహిద్ కపూర్ – మీరా రాజ్ పుత్.. దిశా పటానీ- టైగర్ ష్రాఫ్ ఈ సీజన్ లో మాల్దీవుల విహారం చేశారు. బిపాస బసు- కరణ్ సింగ్ గ్రోవర్.. జహీర్- సాగరిక జంట కూడా మాల్దీవుల విహారంలో చిలౌట్ చేశారు. అక్షయ్ కుమార్ – కత్రినా కైఫ్ – మాధురీ దీక్షిత్ – సోనాక్షి సిన్హా – వేదిక – ప్రణీత – నేహా ధూపియా వంటి వారు కూడా మాల్దీవులను చుట్టి వచ్చారు.