Templates by BIGtheme NET
Home >> Cinema News >> అతడినే పెళ్లాడాలని జాక్వెలిన్ కలలు

అతడినే పెళ్లాడాలని జాక్వెలిన్ కలలు


దాదాపు 200 కోట్ల అక్రమాస్తుల కేసులో సుఖేష్ చంద్రశేఖర్ ని ఈడీ విచారిస్తున్నసంగతి తెలిసిందే. ఈ మనీలాండరింగ్ కేసులో సహనిందితురాలు బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను విచారిస్తున్నారు. ఒక్కోరోజు విచారణలో షాకింగ్ వివరాలు బయటకు వస్తున్నాయి.

తాజా నివేదికల ప్రకారం.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సుఖేష్ చంద్రశేఖర్ ను పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇంతకుముందు వారిద్దరికీ సంబంధించిన కొన్ని సన్నిహిత ఫోటోలు బయటకు వచ్చినప్పుడు జాక్వెలిన్ తమ సంబంధం గురించి అన్ని పుకార్లను ఖండించింది.

తాజా కథనాల ప్రకారం జాక్విలిన్ సుఖేష్ చంద్రశేఖర్ ను వివాహం చేసుకోవాలని భావించారు. అప్పటికి తన డ్రీమ్ మ్యాన్ ను కనుగొన్నట్లు తన స్నేహితులకు కూడా చెప్పింది. జాక్వెలిన్ను ప్రశ్నించిన EOW తో ఒక సీనియర్ అధికారి సుఖేష్ తో జాగ్రత్తగా ఉండాలని సహనటులు ఆమెకు సలహా ఇచ్చారు. కానీ ఆమె అతనిని కలవడం మానలేదు. కార్లు పెంపుడు జంతువుల వంటి ఖరీదైన బహుమతులను స్వీకరించడం కొనసాగించింది.

మరోవైపు ఇదే దోపిడీ కేసుకు సంబంధించి నటి నోరా ఫతేహిని కూడా ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం విచారిస్తోంది. నోరా ఫతేహీని ఐదు గంటల పాటు ప్రశ్నించారు. సుఖేష్ చంద్రశేఖర్ అనే మోసగాడు ఫతేహితో సంబంధాన్ని ప్రారంభించడానికి ప్రయత్నించాడని కానీ ఎక్కడో ఏదో తప్పు జరుగుతోందని గ్రహించి అతని నుండి దూరంగా ఉంది.

ఆమె సుఖేష్ తో అన్ని సంబంధాలను తెంచుకుంది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మాత్రం దేనికీ భయపడకుండా అన్నీ తెలిసి కూడా బహుమతులు అందుకోవడానికి వెళ్ళింది.

జాకీ – నోరాతో పాటు మరో ముగ్గురు బాలీవుడ్ నటీమణులు కూడా సుఖేష్ నుండి బహుమతులు – డబ్బు అందుకున్నారని వారిని కూడా త్వరలో విచారించనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకుముందు పలువురు కథానాయికల పేర్లు వినిపించినా కానీ తర్వాత గప్ చుప్ అయ్యింది. ఇప్పుడు వారి పేర్లను విచారణ అధికారులు బయటపెట్టనున్నారని తెలిసింది.