Templates by BIGtheme NET
Home >> Cinema News >> రాంగోపాల్ వర్మ ‘మర్డర్’ సినిమాపై తీర్పు వాయిదా

రాంగోపాల్ వర్మ ‘మర్డర్’ సినిమాపై తీర్పు వాయిదా


మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘మర్డర్’ పేరుతో సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే.

అయితే తన జీవితంపై సినిమా చేస్తున్న నిర్మాతలకు ప్రణయ్ భార్య అమృత గతంలోనే కోర్టు ద్వారా నోటీసులు పంపింది. అనుమతులు లేకుండా తన కథ ఆధారంగా సినిమా తీస్తున్నారంటూ ఆమె నల్లగొండ జిల్లా కోర్టులో పిటీషన్ వేశారు. మర్డర్ సినిమా విడుదల ఆపాలని.. పబ్లిసిటీ ఆపమని కోరుతూ కోర్టును అమృత కోరారు. ఈ మేరకు కోర్టు ద్వారా మర్డర్ సినిమా నిర్మాతలు నట్టి క్రాంతి నట్టి కరుణలకు నోటీసులు పంపారు.

ఈనెల 6న నిర్మాతలు కోర్టుకు హాజరై వారి వాదనను తెలుపాలని కోర్టు నోటీసుల్లో పేర్కొంది. ‘మర్డర్’ సినిమా ట్రైలర్ ను ఇప్పటికే వర్మ విడుదల చేయగా.. అది వైరల్ అయ్యింది. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు వర్మ ప్లాన్ చేయగా అమృత కోర్టుకు వెళ్లి అడ్డుకుంటోంది.

కాగా తాజాగా వర్మ తీస్తున్న ‘మర్డర్’ సినిమా విడుదల కాకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టులో అమృత వేసిన పిటీషన్ పై ఈరోజు విచారణ పూర్తయ్యింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును ఈనెల 24కు వాయిదా వేసింది. 24 న వర్మ సినిమా విడుదల అవుతుందా? కోర్టు అడ్డుకుంటుందా అన్నది ఆసక్తి రేపుతోంది. వర్మ వర్సెస్ అమృత ఎపిసోడ్ లో తుది తీర్పు కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.