Templates by BIGtheme NET
Home >> Cinema News >> మహానటి బ్యాక్.. లుక్ మార్చేసిన బ్యూటీ

మహానటి బ్యాక్.. లుక్ మార్చేసిన బ్యూటీ


మహానటి చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు హీరోయిన్ కీర్తి సురేష్. ఈ చిత్రంలో ఆమె నటన అందరి మన్ననలూ పొందింది. అయితే.. ఆ తర్వాత వచ్చిన సినిమాల ఫలితంపై ఎంత డిస్కషన్ జరిగిందో.. ఆమె బాడీ లాంగ్వేజ్ పై అంతకన్నా ఎక్కువ చర్చ సాగింది. గతంతో పోలిస్తే కీర్తి చాాలా బరువు తగ్గడమే ఇందుకు కారణం. కీర్తి సురేష్ నటించిన మిస్ ఇండియా పెంగ్విన్ చిత్రాలలో ఆమె బరువు తగ్గి కనిపించారు. ఈ లుక్ అభిమానులను అంతగా ఆకట్టుకోలేదు. ఆమె రూపం పట్ల నెగెటివ్ టాకే వినిపించింది. దీంతో.. ఆ ప్రభావం ఆమె లేటెస్ట్ మూవీపై పడుతుందేమోనని నిర్మాతలు జాగ్రత్తలు తీసుకున్నారట. కీర్తి సురేష్ ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటిస్తోంది. అయితే.. గతానుభవాన్ని గుర్తుపెట్టుకొని కీర్తిని బరువు పెరగాలని సూచించారట ప్రొడ్యూసర్స్.

వస్తున్న ఫీడ్ బ్యాక్ ను గమనించి బరువు పెరుగుతున్నారట కీర్తి సురేష్. ఆమె లేటెస్ట్ పిక్స్ కూడా ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. ఆమె తాజా ఫొటోలలో అంత సన్నగా కనిపించడం లేదంటున్నారు. ప్రతి ఒక్కరూ ఇష్టపడే తన మునుపటి రూపాన్ని తిరిగి పొందడానికి కీర్తి ట్రై చేస్తోందని చెబుతున్నారు.

నిజానికి హీరోయిన్ కు కావాల్సింది ఇదే.. అభిమానులు తనను ఎలా చూడాలని కోరకుంటారో.. అలాగే ఉండాలి. అప్పుడే అటు ప్రేక్షకుల్లో ఆదరణ ఇటు ఇండస్ట్రీలో అవకాశాలూ పెరుగుతాయి. సో.. ఇప్పుడు కీర్తి సురేష్ కూడా ఇదే ప్రిన్సిపుల్ ఫాలోవుతున్నారు. ఇదే నిజమైతే.. రాబోయే ‘సర్కారు వారీ పాట’లో కీర్తి గత బ్యూటీని చూడొచ్చు.