Templates by BIGtheme NET
Home >> Cinema News >> నెట్టింట బికినీతో చిచ్చు రేపుతున్న మగధీర భామ..!!

నెట్టింట బికినీతో చిచ్చు రేపుతున్న మగధీర భామ..!!


బాలీవుడ్ నటి కిమ్ శర్మ.. గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాస్త తక్కువే ఉంటుంది. ఎందుకంటే ఈ భామ కెరీర్లో ఎక్కువగా బాలీవుడ్ సినిమాలలోనే మెరిసింది. ఇక తెలుగు విషయానికి వస్తే కృష్ణవంశీ రూపొందించిన ఖడ్గం సినిమాతో తెలుగులో అడుగుపెట్టింది కిమ్. ఇక ఖడ్గం తర్వాత మళ్ళీ బాలీవుడ్ వైపు వెళ్ళిపోయింది. కానీ తెలుగులో మాత్రం అడపాదడపా ఐటమ్ సాంగ్స్ చేస్తూ పలకరించింది. ప్రస్తుతం ఈ వయ్యారి వయసు నలభై ఏళ్ళు. కానీ వయసుతో సంబంధం లేకుండా కిమ్.. లైఫ్ తెగ ఎంజాయ్ చేస్తోంది. హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయిన కిమ్.. లవ్ అఫైర్స్ తో మాత్రం నిత్యం వార్తలలో నిలిచేది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన కిమ్.. 2000లో మొహబ్బాతేన్ అనే సినిమాతో బాలీవుడ్ అరంగేట్రం చేసింది.

ఆ సినిమా హిట్ అవ్వడంతో అమ్మడికి అవకాశాలు బాగానే వచ్చాయి. కానీ క్లోస్ అప్ పెప్సీ ఫెయిర్ అండ్ లవ్లీ లాంటి కమర్షియల్ యాడ్స్ తోనే ఎక్కువ పాపులర్ అయింది. ఇక సోషల్ మీడియాలో ఎల్లపుడు యాక్టీవ్ గా ఉండే ఈ ముదురు భామ.. ఇంస్టాగ్రామ్ వేదికగా బీచ్ లో దిగిన బికినీ ఫోటోస్ పోస్ట్ చేస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది. కానీ నాలుగు పదుల వయసు మీద పడినా ఈ భామ శరీరాకృతి మాత్రం అలాగే మెయింటైన్ చేస్తోంది. అప్పుడెప్పుడో మగధీర ఆంజనేయులు సినిమాలలో ఐటమ్ సాంగ్స్ తో మెప్పించిన కిమ్.. మళ్ళీ తెలుగు తెరపై కనిపించలేదు. ఇక 2010లో పెళ్లి చేసుకొని ఆరేళ్ళకే విడాకులు తీసుకొని ప్రస్తుతం బీచ్ స్విమ్మింగ్ పూల్స్ లలో బికినీ షూట్స్ చేస్తోంది. మొత్తానికి ఆమె అందాలతో నెటిజన్లకు నిద్ర లేకుండా చేస్తోంది అనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం అమ్మడి బికినీ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.