Templates by BIGtheme NET
Home >> Cinema News >> రూ.2 కోట్ల యాడ్ అందుకే వదిలేశా: సాయి పల్లవి

రూ.2 కోట్ల యాడ్ అందుకే వదిలేశా: సాయి పల్లవి


‘అందం శరీరఛాయను ఎత్తిచూపుతూ మనుషులను చులకనగా చూసే ఈ సమాజంలో మన స్నేహితులు బంధువులు కూడా ఉంటారు. అలాంటి వారిని నేను చాలా మందిని చూశాను’ అంటోంది నేచరుల్ బ్యూటీ సాయిపల్లవి. ఈ జనం నల్లగా ఉన్న వారిని తెల్లగా ఉన్న వారిని వేర్వేరుగా చూస్తుంటారని చెబుతోంది. సాయి పల్లవి సహజంగా కనిపించేందుకు ఇష్టపడుతూ ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. తన సినిమాల్లోనూ మేకప్ వేసుకునేందుకు అంతగా ఇష్టపడదు ఈ బ్యూటీ. నేచురల్గా కనిపించేందుకే ఆసక్తి చూపిస్తుంటుంది. ఇప్పుడు జనాలు కూడా సాయి పల్లవిని అలా చూసేందుకే ఇష్ట పడుతుంటారు. సహజ సౌందర్యానికి ప్రాధాన్యత ఇచ్చే సాయి పల్లవి ఆ మధ్య ఓ భారీ యాడ్ ను రిజెక్ట్ చేసిన విషయం తెలిసిందే. తమ ఫెయిర్ నెస్ క్రీమ్ ను ప్రమోట్ చేయాలని ఓ కంపెనీ కోరింది. ఇందుకు రెండు కోట్ల రూపాయలు ఇస్తామని కూడా ఆఫర్ చేసింది. కానీ.. ఆ ఆఫర్ను సాయి పల్లవి తిరస్కరించేసింది. అలాంటి బూటకపు ప్రచారాలు కృత్రిమ అందాలను తాను ప్రోత్సహించనని చెప్పిందట. అయితే.. ఇలా చేయడం వెనుక పెద్ద స్టోరీయే ఉందని చెప్పింది సాయి పల్లవి.

నా మొహం మీద చాలా మొటిమలు ఉండేవి. వాటిని చూసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లేదాన్ని కాదని సాయి పల్లవి చెప్పింది. ‘ఎదుటివారు కేవలం నా మొటిమలను మాత్రమే చూసి ఎందుకు మాట్లాడుతున్నారు..? నా కళ్లలోకి చూసి ఎందుకు మాట్లాడడం లేదు?’ అని తనలో తాను బాగా ఆలోచించేదాన్ని అని చెప్పింది. ‘ఇలా.. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని కానీ.. ‘ప్రేమమ్’ తర్వాత ప్రజలు నన్ను నన్నుగానే ఇష్టపడ్డారు’ అని సాయి పల్లవి వెల్లడించింది.

‘తెల్లగా మారడం కోసం నా సోదరి తనకి ఇష్టంలేని ఆహార పదార్థాలను సైతం తినేది. దీంతో.. అందంగాలేము అనుకునేవాళ్లు సమాజంలో వాళ్లు ఒంటరి కాదు అని నిరూపించాలనుకున్నా. నా సోదరిలో ప్రేరణ నింపడానికైనా నేను నాలానే ఉండాలని నిశ్చయించుకొన్నా. అందుకే ఫెయిర్నెస్ క్రీమ్ ప్రకటనకు నో చెప్పాను’ అంటూ అసలు విషయం వెల్లడించింది సాయి పల్లవి. ఇది నిజంగా మెచ్చుకోదగిన నిర్ణయమే కాదా.. ఏమంటారు?