Templates by BIGtheme NET
Home >> Cinema News >> త్రోబ్యాక్.. పెగ్గు మీద పెగ్గేసి పార్టీలోనే గొడవకు దిగిన తార

త్రోబ్యాక్.. పెగ్గు మీద పెగ్గేసి పార్టీలోనే గొడవకు దిగిన తార


బాలీవుడ్ ఫేజ్ 3 కల్చర్ లో మందు చిందు అనేవి సర్వసాధారణం. అయితే అలాంటి ఓ పార్టీలో ఇద్దరు భామల మధ్య గొడవ పతాక స్థాయికి చేరుకోవడం మధ్యలో వేరొకరు తలదూర్చి పరిష్కరించడం అప్పట్లో సంచలనమే అయ్యింది. అప్పట్లో ముంబైలోని ఓ ఖరీదైన రెస్టారెంట్ లో మనీష్ మల్హోత్రా 50వ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి.. ఆ పార్టీలో పెగ్గు మీద పెగ్గు లాగించేసిన మలైకా అదుపు తప్పి తూలి పడబోయిందట. దాంతో తనకు సాయం చేసేందుకు పక్కనే ఉన్న సోనమ్ కపూర్ పడకుండా ఆపే ప్రయత్నం చేసిందట. సాయం కావాలంటే నేనున్నాను! అంటూ సోనమ్ తనని వారించబోతే “బ్యాక్ ఆఫ్“ (వెనక్కి వెళ్లు) అంటూ సోనమ్ పై మలైకా గట్టిగానే అరిచేసింది. నాకు నేను వెళ్లగలను.. ఎవరి సాయం అవసరం లేదు! అంటూ రుసరుసలాడేయడంతో చుట్టూ ఉన్నవాళ్లంతా అవాక్కయ్యారు.

చివరికి ఆ ఇద్దరి గొడవ మనీష్ – కరణ్ జోహార్ కలగజేసుకోవడంతో సద్ధుమణిగింది. ఆ పార్టీకి సంబంధించిన ఫోటోలు అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అయ్యాయి. ఇక అప్పటికే మలైకా తన భర్త ఆర్భాజ్ ఖాన్ కి విడాకులు ఇచ్చి కలతలో ఉన్నారు. ఆ తర్వాత ఇలా మందు పార్టీలో రభస సాగిందనేది బాలీవుడ్ మీడియా కథనాలు వెల్లడించాయి.

అప్పుడప్పుడే యువహీరో అర్జున్ కపూర్ తో మలైకా ఎఫైర్ వార్తలు అంతకంతకు వేడెక్కుతున్నాయి. ఆ ఇద్దరి ఎఫైర్ విషయంలో సమర్ధించిన సోనమ్ కపూర్ కి ఆ రాత్రి ఊహించనిదే ఎదురైంది.