Templates by BIGtheme NET
Home >> Cinema News >> మంచు హీరోలు వెబ్ వరల్డ్ లో సత్తా చాటాలని చూస్తున్నారా…?

మంచు హీరోలు వెబ్ వరల్డ్ లో సత్తా చాటాలని చూస్తున్నారా…?


తెలుగు చిత్ర పరిశ్రమలో మంచు మోహన్ బాబు కి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ప్రొడ్యూసర్ గా హీరోగా విలన్ గా ప్రతినాయకుడిగా హాస్యనటుడిగా ఎన్నో విలక్షమైన చిత్రాలు ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి టాలీవుడ్ ప్రేక్షకుల్లో ‘కలెక్షన్ కింగ్’ గా.. ‘డైలాగ్ కింగ్’ గా గుర్తుండిపోయారు. ఇక ఆయన నటవారసత్వంతో మంచు విష్ణు – మంచు మనోజ్ – మంచు లక్ష్మి ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అయితే కెరీర్ స్టార్టింగ్ లో హీరోలుగా రాణించిన విష్ణు – మనోజ్ లు రేస్ లో వెనుకబడిపోయారు అనే కామెంట్స్ వినిపిస్తుంటాయి. బ్యాక్ గ్రౌండ్ ఉండటం వలన ఇంకా ఇండస్ట్రీలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో డైరెక్ట్ గా వారిని ట్యాగ్ చేస్తూనే నెటిజన్స్ కామెంట్స్ చేస్తుంటారు. అయితే నిజానికి మంచు హీరోలు సినిమా కోసం చాలా కష్టపడతారని ఇండస్ట్రీలో చెప్పుకుంటారు. సినిమాకి సంబంధించి అన్ని క్రాఫ్ట్స్ మీద అవగాహన ఉండి సెలెక్టివ్ గా మూవీస్ చేసుకుంటూ వెళ్తారని.. కాకపోతే అదృష్టం కలిసి రావడం లేదని అంటుంటారు. ప్రస్తుతం చెరొక ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న మంచు హీరోలు ఇప్పుడు వెబ్ వరల్డ్ లో సత్తా చాటాలని చూస్తున్నారని తెలుస్తోంది.

మంచు విష్ణు ప్రస్తుతం ‘మోసగాళ్లు’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ప్రపంచలోనే బిగ్గెస్ట్ ఐటీ స్కామ్ నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని విష్ణు హోమ్ బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. ఈ క్రమంలో విష్ణు స్వీయ నిర్మాణంలో ఓ వెబ్ సిరీస్ లో నటించడానికి ప్లాన్స్ చేసుకుంటున్నాడని సమాచారం. ఇప్పటికే ప్రొడ్యూసర్ గా శ్రీకాంత్ తో ‘చందరంగం’ అనే వెబ్ సిరీస్ నిర్మించిన సంగతి తెలిసిందే. మరోవైపు మంచు లక్ష్మి ఆల్రెడీ వెబ్ వరల్డ్ లో అడుగుపెట్టి ‘సుబ్బలక్ష్మి’ అనే సిరీస్ లో నటించింది. మరోవైపు టాలెంటెడ్ హీరో మంచు మనోజ్ దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఆయన మళ్ళీ ”అహం బ్రహ్మాస్మి” అనే సినిమాతో రాబోతున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. మరి మంచు హీరోలు వెబ్ వరల్డ్ లో సత్తా చాటి సరైన ఫామ్ లో వస్తారేమో చూడాలి.