Templates by BIGtheme NET
Home >> Cinema News >> మరణం నుంచి డబ్బు సంపాదిస్తున్నారు..మీకు ధన్యవాదాలు

మరణం నుంచి డబ్బు సంపాదిస్తున్నారు..మీకు ధన్యవాదాలు


బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో మొదటి నుంచి అనుమానాలు వ్యక్తం అవుతున్నట్లే భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఈ కేసు విచారణలో ఉండగా నిజానిజాలు బయటపడకుండానే రియా ను మీడియా ఇబ్బందులకు గురి చేయడం బాగాలేదంటూ ఓ వర్గం సెలెబ్రిటీలు ఆరోపిస్తూ వచ్చారు. మంచు లక్ష్మి సైతం రియాకు మద్ధతు తెలుపుతూ ‘నిజాలు తెలుసుకోకుండా ఒకరిని కించపరచడం సమంజసం కాదని.. వారి కుటుంబ సభ్యుల గురించి కూడా నిజాలు తెలుసుకోకుండా నిందలు వేయడం భావ్యం కాదని’ మంచు లక్ష్మీ సుధీర్ఘమైన పోస్ట్ పెట్టింది. దీనికి తాప్సీ – విద్యా బాలన్ – స్వర భాస్కర్ వంటి హీరోయిన్స్ సపోర్ట్ చేశారు. అంతేకాకుండా ఈ మధ్య ఎన్సీబీ విచారణకు హాజరైన రియా పట్ల మీడియా ప్రవర్తించిన తీరుపై.. మైకులతో ఆమె మీద పడిపోవడం వంటి దృశ్యాలపైనా స్పందించింది. ఈ క్రమంలో మరోసారి మంచు లక్ష్మి ఈ కేసులో మీడియా పాత్రపై స్పందించింది.

మంచు లక్ష్మి ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ పెడుతూ.. ”సుశాంత్ మరణం నుంచి ఎక్కువ డబ్బు సంపాదించినందుకు.. మన దేశానికి సేవ చేసిన కుటుంబాన్ని నాశనం చేసినందుకు ఇండియన్ మీడియా ఛానెళ్లకు అభినందనలు. ఈ రోజుల్లో మనస్సాక్షి అంటే ఓ లగ్జరీ అని గెస్ చేస్తున్నాను. మీరు నిజంగా సుశాంత్ సింగ్ గురించి పట్టించుకున్నారా లేదా అతని ఫేమ్ ను వాడుకుని డబ్బు మాత్రమే సంపాదించుకోవాలని అనుకున్నారా అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ దేశానికి ఎన్నో యేళ్లుగా ఎంతో మంది మహిళలు సేవలు చేస్తూ ఈ దేశ పునాదులు నిర్మించారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇది మళ్లీ గుర్తు చేయడం.. దానిని చెప్పడం ఎంతో అవసరం. మనమందరం ఒక్కటే అని గ్రహించాలి.. లింగ వివక్ష చూపి రెండు వేర్వేరుగా చూడకూడదు. జస్టిస్ ఫర్ రియా” అని పేర్కొంది. అంతేకాకుండా ట్విట్టర్ లో వాస్తవాల ఆధారంగా ఇది నిజం అంటూ ఓ ఫైచార్ట్ పోస్ట్ చేసి ‘భారతీయులు దేని గురించి ఆందోళన చెందుతున్నారు’ అనే విషయంపై ట్వీట్ చేసింది. దీంట్లో ఎక్కువ శాతం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గురించి ఆందోళన చెందుతున్నట్లు చూపిస్తుండగా కేవలం కొద్ది శాతం మాత్రమే కరోనా గురించి ఆందోళన చెందుతున్నట్లు చూపిస్తోంది. మంచు లక్ష్మీ చేసిన ఈ రెండు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.