Templates by BIGtheme NET
Home >> Cinema News >> క్యాన్సర్ పేషంట్ గా నటిస్తున్న మిల్కీ బ్యూటీ..!

క్యాన్సర్ పేషంట్ గా నటిస్తున్న మిల్కీ బ్యూటీ..!


మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా – టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”గుర్తుందా శీతాకాలం”. నాగశేఖర్ మూవీస్ బ్యానర్ పై నాగశేఖర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇది కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ‘లవ్ మాక్ టైల్’ చిత్రానికి తెలుగు రీమేక్ గా తెరకెక్కనుంది. ఇటీవలే ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారభించారు. ఈ చిత్రంలో తమన్నా క్యాన్సర్ పేషంట్ గా నటించనుందని సమాచారం. ‘గుర్తుందా శీతాకాలం’లో ఈ రోల్ కావాలని మిల్కీ బ్యూటీ పట్టుబట్టి మరీ సాధించుకుందట. కెరీర్ లో ఎన్నో పాత్రల్లో నటించిన తమన్నాకి ఈ క్యారెక్టర్ మంచి పేరు తెచ్చిపెడుతుందని నమ్మకంగా ఉందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

‘గుర్తుందా శీతాకాలం’ సినిమా షూటింగ్ లో తమన్నా వచ్చే నెల నుంచి జాయిన్ అవుతుందని సమాచారం. శరవేగంగా షూటింగ్ చేసి ఈ చిత్రాన్ని 2021 ఏప్రిల్ 1న విడుదల చేసేలా మేకర్స్ సన్నాహాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి సత్యా హెగ్డే సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. యువ సంగీత దర్శకుడు కాలభైరవ సంగీతం సమకూర్చనున్నాడు. ఇక ఇప్పటికే ‘సీటిమార్’ సినిమా షూటింగ్ పూర్తి చేసిన మిల్కీ బ్యూటీ.. ‘గుర్తుందా శీతాకాలం’ తో పాటు ‘అంధాదున్’ తెలుగు రీమేక్ లో కూడా నటించనుంది. హిందీలో టబు పోషించిన నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో తమన్నా కనిపించనుంది.