Templates by BIGtheme NET
Home >> Cinema News >> మూవీ ప్రొడక్షన్ లోకి ఏపీ మాజీ సీఎం మేనల్లుడు..!

మూవీ ప్రొడక్షన్ లోకి ఏపీ మాజీ సీఎం మేనల్లుడు..!


సినీ ఇండస్ట్రీకి రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంటుంది అంటుంటారు. సినిమాల ద్వారా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నవారు పాలిటిక్స్ లోకి వెళ్తుంటారు. అలానే రాజకీయ నాయకుల ఫ్యామిలీ మెంబెర్స్ హీరోలుగానో లేదా ప్రొడ్యూసర్స్ గానో సినిమా రంగంలోకి వస్తుంటారు. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి మేనల్లుడు ఇప్పుడు మూవీ ప్రొడక్షన్ లోకి దిగారని తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మేనల్లుడు అద్వయ జిష్ణు రెడ్డి నిర్మాతగా మారారు. విర్గో పిక్చర్స్ బ్యానర్ స్థాపించి మరో నిర్మాత శిల్పా చౌదరీ తో కలిసి ప్రొడక్షన్ నెం.1 గా ”సెహరి” అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు.

న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో హర్ష కనుమల్లి – సిమ్రాన్ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. నేడు ప్రారంభమైన ఈ చిత్రం ముహూర్తం సన్నివేశానికి స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు క్లాప్ ఇచ్చారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడు అల్లు బాబీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఏషియన్ సినిమాస్ భరత్ నారంగ్ స్క్రిప్ట్ ని మేకర్స్ చేతికి అందించారు. ఈ రోజే ”సెహరి” టైటిల్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. పలు యాడ్ ఫిలిమ్స్ ని డైరెక్ట్ చేసిన జ్ఞాన సాగర్ ద్వారక ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. సురేష్ సారంగం సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రశాంత్ ఆర్.విహారి సంగీతం సమకూరుస్తుండగా.. రవితేజ గిరజాల ఎడిటింగ్ వర్క్ చేయనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించనున్నాడు.