Templates by BIGtheme NET
Home >> Cinema News >> పైరసీని ఆపడానికి ఫ్యాన్స్ సైనికులు కావ్వాలన్న బాలయ్య

పైరసీని ఆపడానికి ఫ్యాన్స్ సైనికులు కావ్వాలన్న బాలయ్య


పైరసీని నిరోధించేందుకు అభిమనులే సైనికులు కావాలని పిలుపునిచ్చారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఆయన స్వయంగా దర్శకత్వం వహించి నటించిన తొలి చిత్రం నర్తనశాల. సౌందర్య కథానాయికగా నటించారు. హాఫ్ మేకింగ్ మూవీ గా థియేట్రికల్ రిలీజ్ కి ఆస్కారం లేకపోవడంతో శ్రేయాస్ ఈటీలో రిలీజైంది. ప్రస్తుతం యాప్ లో డిజిటల్ ప్రీమియర్ ను కలిగి ఉంది. సినిమాకి ప్రారంభ స్పందన చాలా బాగుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు టీజర్ తో నర్తనశాల హైప్ పెరిగింది. ముఖ్యంగా ఆవురావురుమని ఉన్న నందమూరి అభిమానులు ఈ మూవీపై ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు.

ఇంతలోనే ఈ చిత్రం విడుదలకు ముందే బాలయ్య ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. దాని సారాంశం ఏమంటే నర్తనశాలను పైరసీలో చూడొద్దని బాలయ్య నివేదన. అభిమానులు సినీ ప్రేమికులందరూ అప్రమత్తంగా ఉండాలని ఏదైనా పైరసీ లింకు దొరికితే దానిని తమకు తెలియజేయాలని ఆయన అభ్యర్థించారు. పైరసీని తొలగించి సినిమాను కాపాడటంలో అభిమానులందరూ ‘సైనికులు’ కావాలని బాలయ్య కోరారు.

నార్తనాసల మహాభారతం పురాణం మీద ఆధారపడింది. ఈ చిత్రంలో దిగ్గజ దివా సౌందర్య .. పూర్వపు స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీహరి కీలక పాత్రల్లో నటించారు.