Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘సైడ్-బి’ తొలి సింగిల్ తోనే ట‌చ్ చేసారుగా!

‘సైడ్-బి’ తొలి సింగిల్ తోనే ట‌చ్ చేసారుగా!


ర‌క్షిత్ శెట్టి- రుక్మిణి వసంత్ జంట‌గా జంట‌గా హేమంత్ ఆర్ రావు తెరకెక్కించిన ‘స‌ప్త‌సార‌గాలు దాటి’ -‘సైడ్ -ఏ’ తెలుగులోనూ మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. విమ‌ర్శ‌కుల ప్ర‌శంసలు ద‌క్కించుకుంది. ఎమోష‌న‌ల్ ల‌వ్ జర్నీ ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయింది. దీంతో క‌న్న‌డ సినిమా సౌండింగ్ టాలీవుడ్ లో మ‌రోసారి గ‌ట్టిగానే మ్రోగింది. ఇదే స‌మ‌యంలో ‘సప్త‌సాగ‌రాలు దాటి’ నుంచి ‘సైడ్ -బి’ కూడా ఉంద‌ని రివీల్ చేసిన సంగ‌తి తెలిసిందే.

మొద‌టి భాగానికి కంటున్యూటీగా రెండ‌వ భాగాన్ని రిలీజ్ చేస్తున్నారు. దీంతో సైడ్ -బిపై తొలి నుంచి భారీ అంచ‌నాలు నెలొక‌న్నాయి. ఈనేప‌థ్యంలో రిలీజ్ చేసిన టీజ‌ర్ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంది. టీజ‌ర్ లో మ‌రోసారి జోడీ ఎమోష‌న‌ల్ జ‌ర్నీతో అల‌రించింది. ప్రేక్ష‌కుల‌కు టీజ‌ర్ బాగా క‌నెక్ట్ అయింది. దీంతో సైడ్ -ఏ ని మించి సైడ్ -బీ ఉంటుంద‌ని అంచ‌నాలు రెట్టింపు అవుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో తాజాగా లిరిక‌ల్ సింగిల్స్ తోనూ హీటెక్కించే బాధ్య‌త తీసుకున్నారు. తాజాగా కొద్ది సేప‌టి క్రిత‌మే ‘నువ్వు నువ్వే’ ప‌ల్ల‌వితో సాగే పాట‌ని విడుద‌ల చేసారు. పాట ఆద్యంతం ఎమోష‌న‌ల్ గా క‌నెక్ట్ అవుతుంది. పాట‌లో తెలుగు సాహిత్యం ఎంతో చ‌క్కగా ఉంది. ట్యూన్ కంపోజిష‌న్ బాగుంది. పాట‌లో ప్రేమికుల ఎమోష‌న్ ని చ‌క్క‌గా క‌నెక్ట్ చేసారు. అజ‌రామార ప్రేమికులు మ‌ధ్య ఎడ‌బాటు హైలైట్ అవుతుంది.

చ‌ర‌ణ్ రాజ్ సంగీతం శ్రోత‌ల్ని ఆక‌ట్టుకుంటుంది. తొలి సాంగ్ తోనే సంగీత ప‌రంగానూ సినిమాపై పాజిటివ్ ఇంప్రెష‌న్ ప‌డింది. ఈ మూవీని పరంవా స్టూడియోస్ సంస్థ పై రక్షిత్ శెట్టి నిర్మించారు. అన్ని ప‌నులు పూర్తి చేసి ‘సైడ్ బి’ ని నవంబర్ 22న గ్రాండ్ గా పలు భాషల్లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.