Templates by BIGtheme NET
Home >> Cinema News >> 170 మిలియన్ల వ్యూస్ తో రష్మిక సాంగ్ దుమారం

170 మిలియన్ల వ్యూస్ తో రష్మిక సాంగ్ దుమారం


యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు ధృవ్ సర్జా లేటెస్ట్ మూవీ తెలుగు చిత్రసీమలోనూ హాట్ టాపిక్ గా మారింది. ధృవ్ నటించిన కన్నడ చిత్రం `పొగరు` మూవీ సాంగ్ తెలుగులోనూ ఓ ఊపు ఊపేసిన విషయం తెలిసిందే. ఈ పాటలో ధృవ్ సర్జా.. రష్మిక మందన్న టాప్ లేపేశారు. “కరాబు మైండ్.. మెరిసే కరాబు .. చేస్తావా రుబాబు ..` అంటూ ఇటీవల విడుదల చేసిన `పొగరు` మూవీ పాట యూట్యూబ్ లో సంచలనం సృష్టించింది. కన్నడలో మిలియన్ల కద్దీ వ్యూస్ తో రికార్డులు సాధిస్తోంది.

నందకిషోర్ డైరెక్ట్ చేసిన `పొగరు` చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ తెలుగు రైట్స్ కోసం భారీ పోటీ ఏర్పడింది. ఈ పోటీలో ముందు వరుసలో నిలిచి వైజాగ్ ప్రొడ్యూసర్… ఫైనాన్షియర్… ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ డి. ప్రతాప్ రాజు సొంతం చేసుకున్నారు. రైట్స్ కోసం 3 కోట్ల 30 లక్షలు చెల్లించారు. సాయి సూర్యా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. అయితే తెలుగు టైటిల్ ని మాత్రం మారుస్తున్నారట.

కన్నడ.. తెలుగు భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని కన్నడలో `పొగరు` టైటిల్ వినిపిస్తున్నా.. తెలుగులో మాత్రం మరో టైటిల్ తో రిలీజ్ చేయాలనుకుంటున్నామని నిర్మాత డి. ప్రతాప్ రాజు తెలిపారు. ఇటీవల విడుదలైన `పొగరు` కన్నడ సాంగ్ యూట్యూబ్ లో 170 మిలియన్ లకు పైగా వ్యూస్ ని సాధించి రికార్డు సృష్టించింది. ఇదే తెలుగు పాటకు ఇప్పటికి 43 మిలియన్ ల వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ మూవీ తెలుగు రైట్స్ కు భారీ పోటీ ఏర్పడింది. అందరిని అధిగమించి ఈ చిత్రాన్ని ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్న డి. ప్రతాప్ రాజు తెలుగులో భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.