Templates by BIGtheme NET
Home >> Cinema News >> పవర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభం..!

పవర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభం..!


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత ప్లాన్ చేసుకున్న లైనప్ లో యువ దర్శకుడు సాగర్ కె. చంద్ర ప్రాజెక్ట్ కూడా ఉన్న విషయం తెలిసిందే. మలయాళ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాకు ఇది తెలుగు రీమేక్ అని తెలుస్తోంది. బిజూ మీనన్ – పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఇప్పుడు తెలుగులో బిజూ మీనన్ పోషించిన నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటించనుండగా.. అతనికి ధీటుగా నిలిచే పాత్రలో దగ్గుబాటి రానా నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో నేడు (డిసెంబర్ 21) సోమవారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

దేవుని పటాలపై ముహూర్తపు సన్నివేశానికి పవన్ కళ్యాణ్ క్లాప్ ఇవ్వగా.. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ప్రముఖ నిర్మాత ఎస్.రాధాకృష్ణ స్క్రిప్ట్ ని దర్శకుడి చేతికి అందించాడు. దీనికి సంబంధించిన ఫోటోలను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం. 12 గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందించనున్న ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ళ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు. ఏ ఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా.. నవీన్ నూలి ఎడిటర్ గా వర్క్ చేయనున్నారు. అనౌన్స్మెంట్ తోనే భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ ప్రాజెక్ట్ 2021 జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.