Templates by BIGtheme NET
Home >> Cinema News >> లారెన్స్ ని ఆత్మ‌లు వెంటాడి వేదిస్తున్నాయ్!

లారెన్స్ ని ఆత్మ‌లు వెంటాడి వేదిస్తున్నాయ్!


రాఘ‌వ లారెన్స్ కొంత కాలంగా హార‌ర్ సినిమాలతోనే బిజీ అయిన సంగ‌తి తెలిసిందే. ‘ముని-2’ నుంచి ఎక్కువ‌గా ఆ త‌ర‌హా సినిమాలే చేస్తున్నాడు. హారర్ థ్రిల్ల‌ర్ స‌క్సెస్ కి సీక్వెల్స్ చేసే ప‌నిలోనే నిమ‌గ్న‌మ య్యాడు. గ‌త రెండు..మూడేళ్ల‌గా ఆ జాన‌ర్ కి పూర్తిగా అంకిత‌మైపోయాడు. ‘కాంచ‌న‌-3′. ..’రుద్ర‌న్’.. ‘చంద్ర ముఖి-2’ అంటూ దెయ్యాలు..ఆత్మల‌తోనే ప్ర‌యాణం చేసాడు. ఇత‌ర ఏ జాన‌ర్ చిత్రాలు ట‌చ్ చేయ‌లేదు.

స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో చేసిన సినిమాలు..ఇత‌ర ద‌ర్శ‌కుల‌తో చేసిన సినిమాలు కూడా అదే కొవ‌కు చెందిన‌వి. ఇటీవ‌లే ‘చంద్ర‌ముఖి-2’ తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు గానీ..అది ఆశించిన ఫ‌లితాన్ని సాధించ‌లేదు. ఈ నేప‌థ్యంలో ‘కాంచ‌న -4’ ఎప్పుడు చేస్తున్నారు? అంటే లారెన్స్ ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చారు. ‘దెయ్యాల మీద సినిమాలు చేసి మ‌న‌శ్శాంతి కోల్పోయాను. రాత్రుళు కూడా క‌ల‌లోకి ఆ సినిమాలే వ‌స్తున్నాయి.

ఆత్మ‌లు..దెయ్యాల‌తో క‌లిసి నిద్ర‌పోతున్నాను. దీంతో నా మైండ్ పిచ్చి పిచ్చిగానూ మారిపోయింది. కానీ ఏదో ఒక రోజు కాంచ‌న‌-4 త‌ప్ప‌కుండా చేస్తాను’ అని అన్నారు. మొత్తానికి వ‌రుస‌గా దెయ్యాల సినిమాలు చేయడంతో లారెన్స్ బాగా డిస్ట‌బెన్స్ కి గురైన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతానికి వాటినుంచి రిలాక్స్ అయ్యేందు కు ఆజాన‌ర్ కి భిన్న‌మైన సినిమాలు చేస్త‌న్నాడు.

‘ఇటీవ‌లే ‘జిగ‌ర్తాండ్ డ‌బుల్ ఎక్స్’ షూటింగ్ పూర్తిచేసాడు. ప్ర‌స్తుతం ఆ సినిమా పోస్ట్ ప్రొడక్ష‌న్ ప‌నుల్లో ఉంది. ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. సినిమా విజ‌యం సాధిస్తుంద‌న్న ధీమాని వ్య‌క్తం చేసాడు లారెన్స్ . కార్తీక్ సుబ్బ‌రాజ్ మేకింగ్ కి ఫిదా అయిన‌ట్లు తెలిపారు. అలాగే మ‌రో త‌మిళ్ సినిమా కూడా సెట్స్ లో ఉంది. అయితే వ‌రుస‌గా కోలీవుడ్ లో నే సినిమాలు చేస్తున్నారు త‌ప్ప తెలుగులో మాత్రం సినిమాలు చేయ‌లేదు. ఇక్క‌డ లారెన్స్ కి మంచి పేరుంది. మంచి ప‌రిచ‌యాలున్నాయి. న‌టుడిగా…ద‌ర్శ‌కుడిగా అత‌నితో సినిమాలు చేయ‌డానికి అంతా సిద్దంగానే ఉన్నారు. ఇత‌ర భాష‌ల హీరోలంతా టాలీవుడ్ కి జంప్ అవుతుంటే లారెన్స్ మాత్రం అనువాద చిత్రాల‌తోనే మెప్పిస్తున్నారు.