Templates by BIGtheme NET
Home >> Cinema News >> సుశాంత్ ది హత్యే వాళ్లకు శిక్ష పడాలంటున్న విలన్ ఎంపీ

సుశాంత్ ది హత్యే వాళ్లకు శిక్ష పడాలంటున్న విలన్ ఎంపీ


దేశ వ్యాప్తంగా ప్రస్తుతం సుశాంత్ మృతి గురించి చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో సుశాంత్ గురించిన చర్చ తారా స్థాయిలో జరుగుతున్న విషయం తెల్సిందే. ఇలాంటి సమయంలో ప్రముఖులు కూడా సుశాంత్ మృతి విషయంలో తమకు తోచిన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా రేసు గుర్రం నటుడు రవి కిషన్ స్పందించాడు. ఈయన సుశాంత్ కేసు విషయంలో అందరికి అనేక అనుమానాలు ఉన్నాయి. ప్రతి ఒక్క అనుమానంకు సమాధానం చెప్పాలంటూ కోరాడు. ఈ కేసు విచారణ సమగ్రంగా జరగాలంటూ ఈయన ప్రధానికి లేఖ రాశారు.

ప్రస్తుతం ఈయన ఒక సామన్య నటుడు అయితే ఈయన గురించి పెద్దగా ప్రస్థావన వచ్చేది. కాని ఒక ఎంపీ హోదాలో ఉన్న ఈయన సుశాంత్ ది హత్య అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కనుక ఆయనకు విశ్వసనీయ సమాచారం ఉండి ఉంటుంది. అందుకే ఆ రకంగా మాట్లాడి ఉంటాడు అంటున్నారు. సుశాంత్ హత్య కేసులో ఉన్న ఏ ఒక్కరిని విడిచి పెట్టవద్దంటూ ఎంపీ రవి కిషన్ విజ్ఞప్తి చేశారు. ఇక బాలీవుడ్ లో ఎంతో మంది డ్రగ్స్ కు బానిసలు అయ్యారు.

బాలీవుడ్ మొత్తంను డ్రగ్స్ మాఫియా శాసిస్తుండటం దారుణం. బాలీవుడ్ లో ఎవరికి అయితే డ్రగ్స్ తో సంబంధం ఉందో వారందరిని కూడా అరెస్ట్ చేయాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నాడు. డ్రగ్స్ మాఫియాపై కేంద్రం ఉక్కు పాదం మోపాల్సిన బాధ్యత ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. డ్రగ్స్ మరియు ఇతర నేరాలకు బాలీవుడ్ నెలవైందని వాటిని బాలీవుడ్ నుండి ప్రాలదోలేందుకు కేంద్రం నడుం భిగించాలంటూ ప్రధానికి ఆయన రాసిన లేఖలో పేర్కొన్నారు.