Templates by BIGtheme NET
Home >> Cinema News >> సంచలన విషయాలు బయటపెట్టిన రియా కాల్ రికార్డ్స్..!

సంచలన విషయాలు బయటపెట్టిన రియా కాల్ రికార్డ్స్..!


బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తితోపాటు పలువురిపై సీబీఐ ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసింది. ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిందితులపై మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి వారికి సమన్లు జారీ చేసింది. ఇప్పటికే శామ్యూల్ మిరాండాని 8 గంటల పాటు విచారించిన ఈడీ.. రియాతో పాటు సుశాంత్ ఫ్రెండ్ సిద్దార్థ్ పితాని మరియు శృతి మోదీకి సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు అజ్ఞాతంలో ఉన్న రియా చక్రవర్తి నేడు ముంబై లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరైంది.

కాగా సుశాంత్ కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ క్రమంలో పోలీసులు రియా చక్రవర్తి గతేడాది కాల్ రికార్డులను పోలీసులు పరిశీలిస్తున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం.. రియా చక్రవర్తి దర్శకనిర్మాత మహేష్ భట్ కు 16 కాల్స్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆమె తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తితో 1122 సార్లు మాట్లాడారు. ఇక రియా మేనేజర్ సుశాంత్ బిజినెస్ మాజీ మేనేజర్ శృతి మోదీకి 808 కాల్స్ మరియు శామ్యూల్ మిరాండాకి 289 కాల్స్ చేసినట్లు తెలుస్తోంది. రియా తన బాయ్ ఫ్రెండ్ సుశాంత్ సింగ్ తో ఏడాది కాలంలో 147 సార్లు మాత్రమే మాట్లాడింది. బాయ్ ఫ్రెండ్ తో కంటే శృతి మరియు శామ్యూల్ తో రియా ఎక్కువసార్లు మాట్లాడింది.

ఇక కొందరు సైక్రియార్టిస్ట్స్ తో పాటు సోదరుడు షోయిక్ చక్రవర్తి ఆమె తల్లి సంధ్య చక్రవర్తికి పలుసార్లు ఫోన్ చేశారు. వీరితో పాటు బాంద్రా డీసీపీ అభిషేక్ త్రిముఖితో రియా పలుమార్లు సంభాషించినట్లు వెల్లడైంది. డీసీపీ అభిషేక్ ప్రస్తుతం సుశాంత్ సూసైడ్ కేసుని హ్యాండిల్ చేస్తుండటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసుని విచారిస్తున్న డీసీపీ అభిషేక్ చాలా విషయాలు బయటకి రాకుండా చేసాడని వార్తలు వస్తున్నాయి.