Templates by BIGtheme NET
Home >> Cinema News >> ప్లాప్స్ ఉన్నా ఆ డైరెక్టర్ తో బాగానే సినిమాలు తీస్తున్నారే…!

ప్లాప్స్ ఉన్నా ఆ డైరెక్టర్ తో బాగానే సినిమాలు తీస్తున్నారే…!


Sampath-Nandhi-Latest-Movie-Updates

Sampath-Nandhi-Latest-Movie-Updates

‘ఏమైంది ఈ వేళ’ చిత్రంతో డైరెక్టర్ గా పరిచయమయ్యాడు సంపత్ నంది. ఫస్ట్ సినిమాతోనే యూత్ ఆడియన్స్ కి దగ్గరైపోయాడు. దీంతో రెండో సినిమాయే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేసే ఛాన్స్ కొట్టేశాడు. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ‘రచ్చ’ సినిమా హిట్ గా నిలిచింది. అయితే మూవీలో విషయం లేకపోయినా కేవలం చరణ్ క్రేజ్ వల్ల ఆడిందని అప్పట్లో కామెంట్స్ చేశారు. ఇక ఆ తర్వాత సంపత్ మూడేళ్ళ గ్యాప్ తీసుకొని మాస్ మహారాజా రవితేజతో ‘బెంగాల్ టైగర్’ అనే సినిమా తెరకెక్కించాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా పరాజయం చవి చూసింది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. అయితే కొన్ని రోజులు షూటింగ్ కూడా జరిగిన తర్వాత సంపత్ నంది ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. యాక్షన్ హీరో గోపీచంద్ తో తీసిన ‘గౌతమ్ నందా’ మూవీ హిట్ టాక్ తెచ్చుకున్నా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. అయితే ఇప్పుడు మళ్ళీ మూడేళ్ళ గ్యాప్ తీసుకొని గోపీచంద్ – తమన్నా కాంబోలో ‘సీటిమార్’ అనే సినిమా రూపొందిస్తున్నాడు.

ఇదిలా ఉండగా ఆ మధ్య సంపత్ నంది ప్రొడ్యూసర్ అవతారం కూడా ఎత్తాడు. ‘గాలిపటం’ ‘పేపర్ బాయ్’ అనే సినిమాలు నిర్మించినా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ఈ నేపథ్యంలో కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ‘రచ్చ’ సినిమా ఒక్కటే సంపత్ నంది కి చెప్పుకోదగ్గ హిట్ మూవీ అని చెప్పవచ్చు. ఎన్ని ప్లాప్స్ ఉన్నా సరే సంపత్ కి మాత్రం ఛాన్సెస్ వస్తూనే ఉన్నాయి. లేటెస్టుగా ‘ఏమైంది ఈవేళ’ ‘బెంగాల్ టైగర్’ వంటి సినిమాలను నిర్మించిన శ్రీసత్యసాయి ఆర్ట్స్ కె.కె. రాధామోహన్ ప్రొడ్యూస్ చేస్తున్న ఓ చిత్రానికి సంపత్ నంది కథ – స్క్రీన్ ప్లే – మాటలు అందిస్తున్నాడు. దీంతో పాటు మిస్ ఇండియా ఊర్వశీ రౌతేల హీరోయిన్ గా సంపత్ నంది ‘బ్లాక్ రోజ్’ అనే చిత్రాన్ని క్రియేట్ చేస్తున్నాడు. అయితే ఇన్నాళ్లు ఒకే ఒక్క సినిమాతో నెట్టుకొస్తున్న సంపత్ నందికి బ్యాక్ ఎండ్ లో ఫైనాన్స్ చేసేవారు ఉన్నారని.. అందుకే హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా సంపత్ ఇలా వరుసగా సినిమాలు తీస్తున్నాడని ఫిలిం సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.