Templates by BIGtheme NET
Home >> Cinema News >> సందీప్ వంగా టైటిల్.. డెవిల్ కాదు యానిమల్…!

సందీప్ వంగా టైటిల్.. డెవిల్ కాదు యానిమల్…!


బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో సందీప్ రెడ్డి వంగా మూవీ ఉన్నట్టా లేనట్టా? ఇంతకీ సౌండ్ వినిపించదేం? అంటూ ఇటీవల ఫిలింసర్కిల్స్ లో సర్వత్రా ఆసక్తిక చర్చ సాగింది. చాలా గ్యాప్ వచ్చినా ఈ మూవీకి సంబంధించిన ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో రకరకాల సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ మూవీకి సంబంధించిన మరో కీలక సమాచారం తాజాగా రివీలైంది. సందీప్ వంగా ఇప్పటికీ రణబీర్ అండ్ టీమ్ కి టచ్ లోనే ఉన్నారు. గత వారం క్రితమే చిత్ర నిర్మాతల్ని కలిసాడని సమాచారం. అంతేకాదు ఇంతకుముందు ప్రకటించిన `డెవిల్` టైటిల్ ని మార్చాలన్న ప్రతిపాదన తెచ్చారట. ఇప్పుడు `యానిమల్` అని పేరు మారిందట. అయితే టైటిల్ మార్చడానికి కారణమేమిటి? అంటే.. సల్మాన్ వల్లనేనని తెలిసింది.

ఒక నివేదిక ప్రకారం.. డెవిల్ టైటిల్ ని సాజిద్ నాడియాద్ వాలా రిజిస్టర్ చేయించారట. దీంతో టైటిల్ మార్చాలని సందీప్ వంగా అండ్ మేకర్స్ నిర్ణయించారు. సల్మాన్ నటిస్తున్న `కిక్` సీక్వెల్ కి డెవిల్ టైటిల్ ని ఉపయోగించాలనే ఆలోచనతో ఉన్నారు సాజిద్. సల్మాన్ ఖాన్ నటించిన మొదటి భాగంలో కథానాయకుడు తన అప్రమత్తమైన కార్యకలాపాలను చేపట్టేటప్పుడు `డెవిల్` అనే మారుపేరును ఉపయోగించాడు. దానివల్ల డెవిల్ అన్న పేరు బాగా రిజిస్టర్ అయిపోయింది. అందుకే ఇప్పుడు సీక్వెల్ తో.. సాజిద్ నాడియాద్వాలా డెవిల్ బిరుదును నిలబెట్టుకోవాలనుకుంటున్నాడట.

ఫలితంగా సందీప్ రెడ్డి వంగాతో రణబీర్ కపూర్ తదుపరిది మూవీ టైటిల్ ని `యానిమల్` అని మార్చారు. ఇది మోటైన గ్యాంగ్ స్టర్ డ్రామా .. రణబీర్ సందీప్ ను.. చిత్ర నిర్మాతలు భూషణ్ కుమార్ – మురాద్ ఖేతానీలను సందీప్ గత వారం కలుసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

యానిమల్ కు ముందు రణబీర్ కపూర్ శ్రద్ధా కపూర్ తో కలిసి నటించిన `లవ్ రంజన్` పెండింగ్ పనిని పూర్తి చేస్తాడు. ఇది దిల్లీ- ఘజియాబాద్- నోయిడాలో .. తరువాత విదేశాలలో చిత్రీకరిస్తారు. దీని మొదటి షెడ్యూల్ జనవరి 6 న ప్రారంభమై జనవరి 14 తో ముగుస్తుంది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం షూట్ మే 2021 నాటికి పూర్తవుతుందని ఆ తర్వాత రణబీర్ `యానిమల్` చిత్రీకరణలో జాయినవుతారని చెబుతున్నారు.

2019 లో అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో సందీప్ వంగా బాలీవుడ్ లో అడుగుపెట్టాడు. షాహిద్ కపూర్-నటించిన ఈ చిత్రం విమర్శల నడుమ సంచలన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద 278.24 కోట్లు వసూలు చేసింది. ఇది షాహిద్ కెరీర్ బెస్ట్ గా నిలిచింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఓవర్ నైట్ స్టార్డమ్ తెచ్చింది. ఒరిజినల్ వెర్షన్ అయిన అర్జున్ రెడ్డితోనూ టాలీవుడ్ లో సత్తా చాటాడు. తదుపరి `యానిమల్`తో మరోసారి బాలీవుడ్ లో సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నాడు. అలాగే సందీప్ వంగా ఓటీటీ కోసం పని చేస్తున్నారన్న సమాచారం ఇటీవల అందింది.