Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘ఎడ్జ్’ చూపించేందుకు రెడీ అయిన శృతి హాసన్

‘ఎడ్జ్’ చూపించేందుకు రెడీ అయిన శృతి హాసన్


టాలీవుడ్.. కోలీవుడ్.. బాలీవుడ్ ఇలా అన్ని భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్న ముద్దుగుమ్మ శృతి హాసన్. కమల్ నట వారసురాలిగా ఎంట్రీ ఇచ్చినా ఆ తర్వాత తండ్రి పేరును ఎక్కడ కూడా వాడుకోకుండానే మల్టీ ట్యాలెట్ హీరోయిన్ అంటూ నిరూపించుకుంది. నటిగానే కాకుండా మ్యూజిక్ కంపోజర్ గా సింగర్ గా కూడా శృతి ప్రతిభ చాటిన సందర్బాలు చాలానే ఉన్నాయి. ఈ లాక్ డౌన్ లో షూటింగ్స్ లేకపోవడంతో ఈ అమ్మడు సంగీతంపై దృష్టి పెట్టింది. ‘ఎడ్జ్’ అనే ఒక మ్యూజిల్ వీడియోను విడుదల చేసేందుకు శృతి రెడీ అవుతున్నట్లుగా స్వయంగా ప్రకటించింది.

ఎడ్జ్ అనేది ఆమె సొంతంగా రూపొందించబోతున్న మ్యూజిక్ ఆల్బంలోని ఒక పాటగా చెబుతోంది. ఈ పాటకు ట్యూన్స్ తానే సమకూర్చడంతో పాటు వీడియో కూడా చేసిందట. ఈ వీడియో గురించి సోషల్ మీడియా ద్వారా వెళ్లడి చేస్తూ… సంగీతం నా జీవితంలో భాగం అయినందుకు నేను అదృష్టవంతురాలిని. ఎడ్జ్ అనేది ప్రతి ఒక్కరిలోని అసంపూర్ణమైన ప్రేమను తెలియజేసే ప్రయత్నం. మీరు ఇతరుల్లో మంచితనం చూడాలి. మిమ్మల్ని మీరు నిజంగా అర్థం చేసుకుని ప్రయాణం ప్రారంభించాంటూ పేర్కొంది. ఎడ్జ్ ను ఈనెల 8వ తారీకున అంటే రేపు విడుదల చేబోతున్నట్లుగా పేర్కొంది.

మరో వైపు శృతి హాసన్ హీరోయిన్ గా కూడా వరుసగా చిత్రాలు చేస్తోంది. ఇటీవలే ఈమె నటించిన బాలీవుడ్ మూవీ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక తెలుగులో ఈమె రవితేజకు జోడీగా నటించిన క్రాక్ చిత్రం ఈ కరోనా విపత్కర పరిస్థితులు తొలగిపోయిన తర్వాత విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలు కాకుండా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంలో కూడా ఈమె నటించబోతుంది. ఆ విషయాన్ని స్వయంగా వెళ్లడి చేసింది. చిన్న పాత్రలో పవన్ కు జోడీగా వకీల్ సాబ్ లో ఆమె నటించడం కన్ఫర్మ్ అయ్యింది.