Templates by BIGtheme NET
Home >> Cinema News >> సుశాంత్ : ఆమె డిలీటెడ్ ఫేస్ బుక్ పోస్ట్ తో సరికొత్త అనుమానాలు

సుశాంత్ : ఆమె డిలీటెడ్ ఫేస్ బుక్ పోస్ట్ తో సరికొత్త అనుమానాలు


సుశాంత్ మృతి చెంది రెండు నెలలు దాటినా కూడా ఇంకా అనేక అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఆయన మృతి పట్ల ఉన్న అనుమానాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఎన్నో ప్రశ్నలు జనాల మదిలో మెదులుతున్నాయి. ఆ ప్రశ్నలు రోజు రోజుకు పెరుగుతున్నాయి తప్ప ఏ ఒక్కదానికి కూడా సమాధానం లభించడం లేదు. ఈ కేసు అనేక మలుపులు తిరుగుతూనే ఉంది. మరో కొత్త వ్యక్తి ఈకేసుకు సంబంధించి కీలకంగా మారడం జరిగింది. మహేష్ భట్ అసోసియేట్ అయిన సుహ్రితాదాస్ ఆ రోజు ఫేస్ బుక్ లో చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

సుశాంత్ మృతి చెందిన విషయాన్ని ఆమె ఫేస్ బుక్ లో పేర్కొని రియా విషయంలో విచారం వ్యక్తం చేస్తూ అతడు క్లినికల్ డిప్రెషన్ కు గురై ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఆమె తన పోస్ట్ లో పేర్కొంది. అయితే ఇందులో ఏముంది అని మీకు అనిపించవచ్చు. ఈ పోస్ట్ ను ఆమె సుశాంత్ మృతి చెందిన విషయం ఎవరికి తెలియకముందే చేసింది. ఫేస్ బుక్ లో ఆమె చేసిన పోస్ట్ పబ్లిష్ అయిన తర్వాత గంటకు కాని సుశాంత్ మృతి విషయం బయటకు తెలియలేదు. సుశాంత్ రూం డోర్ ఓపెన్ చేయకుండానే అతడు మృతి చెందాడు అంటూ సుహ్రితాదాస్ కు ఎలా తెలిసింది. సరే ఏదోలా తెలిసింది అనుకుంటే ఆ పోస్ట్ ను ఆమె ఎందుకు వెంటనే డిలీట్ చేసింది అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.

సుహ్రిత కొన్ని నిమిషాల పాటు మాత్రమే ఆ పోస్ట్ ను ఉంచింది. అప్పటికే ఆ పోస్ట్ ను స్ట్రీన్ షాట్స్ తీసిన వారు ఇప్పుడు ఆమె ఫేస్ బుక్ పోస్ట్ స్క్రీన్ షాట్స్ ను సోషల్ మీడియా లో ఉంచుతున్నారు. రియా విషయంలో ఆమె చాలా విచారం వ్యక్తం చేస్తూ తన పోస్ట్ లో ఆవేదన వ్యక్తం చేసింది. నీవు అతడితో ఉండేందుకు ఎంతగా ప్రయత్నించావో మాకు తెలుసు. భట్ సార్ వద్ద నీవు తీసుకున్న సలహాలు కూడా నీ ప్రేమను కాపాడలేక పోయాయి అన్నట్లుగా ఆమె డిలీట్ చేసిన పోస్ట్ లో ఉంది.

మొత్తానికి ఈ స్క్రీన్ షాట్ తో అనుమానాలు మరింతగా వ్యక్తం అవుతున్నాయి. ఈ స్క్రీన్ షాట్ ను ప్రముఖులు షేర్ చేస్తున్న నేపథ్యంలో ముందే నీకు ఎలా సుశాంత్ మృతి చెందిన విషయం తెలిసింది అంటూ ప్రశ్నిస్తున్నారు. సుశాంత్ మృతి కేసులో భట్ గ్యాంగ్ కు ఏదో బలమైన సంబంధం ఉండి ఉంటుందని రియా చక్రవర్తి విషయంలో సీరియస్ గా విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని సుశాంత్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. కేసును సుప్రీం కోర్టు సీబీఐకి అప్పగించిన నేపథ్యంలో మొత్తం నిజాలు బయటకు వస్తాయని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.