Templates by BIGtheme NET
Home >> Cinema News >> #తలైవి.. అమ్మకు మాస్క్ .. ఏమిటీ ట్విస్ట్?

#తలైవి.. అమ్మకు మాస్క్ .. ఏమిటీ ట్విస్ట్?


అమ్మ జయలలిత మాస్క్ పెట్టుకుని అసెంబ్లీకి వెళ్లడమేమిటి? అప్పట్లో కరోనా మహమ్మారీ లేదు కదా? అన్న డౌట్ పుట్టుకొస్తోందా ఈ ఫోటో చూడగానే. అవును… అప్పట్లో కోవిడ్ విలయం లేదు కదా? అసెంబ్లీకి ఈ గెటప్ లో ఎలా వెళ్లింది? అన్న సందేహం కలగొచ్చు.

అయితే ఈ గెటప్ కేవలం షాట్ గ్యాప్ లోనే.. సీన్ లో ప్రవేశించాక మాస్క్ ఉండదు. నాటి వాతావరణంలో అసెంబ్లీ సెషన్స్ జరిగేప్పుడు లైవ్ లో రాజకీయ నాయకులు ఎలా కనిపిస్తారో అలానే తీస్తారు. ఇప్పుడంటే కోవిడ్ 19 విలయం వల్ల జాగ్రత్త తీసుకోవాల్సి వస్తోంది కాబట్టి ఆన్ లొకేషన్ ఈ పాట్లు తప్పడం లేదు.

తలైవి కొత్త షెడ్యూల్ ఇటీవల పూర్తయింది. కంగన రనౌత్ హుషారుగా షూటింగులో పాల్గొన్నారు. కోవిడ్ నియమనిబంధనల ప్రకారం మాస్క్ ధరించి శానిటైజ్ చేసుకుని మరీ సీన్లలో నటించారు. తలైవి ఖద్దరు ధరించినప్పటి బ్లాక్ అండ్ వైట్ ఫోటోల్ని కంగన స్వయంగా సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. వీటిలో ఆమె తమిళనాడు మాజీ సిఎం జయలలితలానే కనిపిస్తోంది. విప్లవ నాయకురాలి సినిమా తలైవి మరో షెడ్యూల్ పూర్తయిందని కంగన స్వయంగా వెల్లడించింది. కరోనా తర్వాత చాలా విషయాలు మారతాయి! అని ట్వీట్ చేసింది. దర్శకనిర్మాతలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు కంగన. ఈ ఫోటోలు పరిశీలిస్తే… కంగనా చీరతో ఆడుకునే ఫోజు.. అలానే అసెంబ్లీ సమావేశంలో మాస్క్ తో కూర్చోవడం కనిపిస్తున్నాయి. కొన్ని ఫోటోల్లో క్వీన్ చిరునవ్వులు చిందిస్తూ మాస్క్ లేకుండానే కనిపించింది. ఇక నాడు జయలలిత యంగ్ ఏజ్ లో ఎలా ఉండేదో ఆల్మోస్ట్ అదే రూపాన్ని కంగన లైవ్ లో చూపించే ప్రయత్నం చేయడం ఆసక్తికరం.

ఎఎల్ విజయ్ దర్శకత్వం లో టీసిరీస్ అసోసియేషన్ తో విష్ణు ఇందూరి- శైలేష్ఆర్. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంజిఆర్ పాత్రలో అరవింద్ స్వామి నటిస్తుండగా.. కరుణానిధి పాత్రల ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. తలైవి పాన్ ఇండియా చిత్రంగా పలు భాషల్లో క్రేజీగా విడుదల కానుంది.