Templates by BIGtheme NET
Home >> Cinema News >> టాలీవుడ్ డ్రగ్స్ మాఫియా కేసు ఏమైంది…?

టాలీవుడ్ డ్రగ్స్ మాఫియా కేసు ఏమైంది…?


సుశాంత్ సింగ్ కేసులో అరెస్టుల పర్వం తెలిసింది. బెయిల్ అభ్యర్ధనను తిరస్కరించిన తరువాత రియా చక్రవర్తిని స్థానిక కోర్టు సెప్టెంబర్ 22 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. అనంతరం రియా చక్రవర్తి తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి పేరు ట్విట్టర్ ఖాతా నుండి కొన్ని ట్వీట్లు విస్మయపరిచాయి.

అవన్నీ నేటి ఉదయం వైరల్ అయ్యాయి. రియా ఏ తప్పు చేయకుండా అరెస్టయ్యిందని ఇది అన్యాయమని ఆయన ఆవేదనను వ్యక్తం చేయడమే గాక.. సుశాంత్ బతికి ఉంటే అరెస్టయ్యేవాడని అవన్నీ ఆయన ఖాతాలో చేరేవని అనడం వైరల్ అయ్యింది. ఈ కేసులో తన కూతురు బలిపశువు అయ్యిందని సుశాంత్ ని ప్రేమించడం వల్లనే ఇలా అయ్యిందని రియా తండ్రి ఇంద్రజీత్ అతఃహశుడయ్యారు. అంతేకాదు.. తన కూతురుకి ఇలా అవ్వడం తట్టుకోలేకపోతున్నానని ఆత్మహత్య చేసుకుంటానని అనడం కలకలం రేపింది.

అయితే ఇవేవీ రియా తండ్రి ట్విట్టర్ నుంచి వచ్చినవి కాదని తేలింది. ఇవి నకిలీ వార్తలు అని ఫాక్ట్ చెకింగ్ వెబ్సైట్ బూమ్ లైవ్.ఇన్ ధృవీకరించింది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంతో సంబంధం ఉన్న డ్రగ్స్ కేసు వల్ల అరెస్టయిన రియాకు నకిలీ ట్విట్టర్ హ్యాండిల్ ఉందని అందులో అభిమానులు న్యాయం కోరుతున్నారని తేలింది.

బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో రియాను స్థానిక కోర్టు సెప్టెంబర్ 22 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. రియా ఒక డ్రగ్స్ సిండికేట్ లో “క్రియాశీల సభ్యురాలు” అని సుశాంత్ కోసం మాదక ద్రవ్యాలను సేకరించేదని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) పేర్కొంది. రియాను ఎన్డిపిఎస్లోని 27 ఎ- 21- 22- 29- 28 సెక్షన్ల కింద అరెస్టు చేసినట్లు ఎన్సిబి డిప్యూటీ డైరెక్టర్ కె పి ఎస్ మల్హోత్రా తెలిపారు.

సుశాంత్ మరణానికి సంబంధించిన వివిధ కోణాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరియు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) సహా మూడు ఫెడరల్ ఏజెన్సీలు పరిశీలిస్తున్నాయి.