Templates by BIGtheme NET
Home >> Cinema News >> గుణశేఖర్ ‘హిరణ్యకశ్యప’ చిత్రానికి త్రివిక్రమ్ సాయం..?

గుణశేఖర్ ‘హిరణ్యకశ్యప’ చిత్రానికి త్రివిక్రమ్ సాయం..?


టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ ప్రస్తుతం ”శాకుంతలం” అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మహాభారత గాథలోని ఆదిపర్వం నందు గల శకుంతల – దుష్యంత మహారాజు ప్రేమ కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. దీని తర్వాత దగ్గుబాటి రానా తో ‘హిరణ్యకశ్యప’ అనే మరో భారీ సినిమా చేయనున్నాడు. నిజానికి ఈ సినిమా ‘శాకుంతలం’ కంటే ముందే స్టార్ట్ అవ్వాల్సింది. ‘రుద్రమదేవి’ సినిమా తర్వాత ఐదేళ్ళు గ్యాప్ తీసుకున్న గుణశేఖర్.. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పై మూడేళ్లు పనిచేసారు. అయితే రానా వేరే ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటంతో ‘హిరణ్యకశ్యప’ కాస్త లేట్ గా మొదలుకానుంది. ఇప్పుడు ఈ సినిమా గురించి ఫిలిం సర్కిల్స్ లో ఓ క్రేజీ గాసిప్ చక్కర్లు కొడుతోంది.

అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘హిరణ్యకశ్యప’ చిత్రానికి మాటలు అందించే అవకాశం ఉందట. దర్శకుడు గుణశేఖర్ లాక్ డౌన్ సమయంలో ఈ సినిమాకు మాటలు అందించమని త్రివిక్రమ్ ను కోరినట్లు చెప్పుకుంటున్నారు. అయితే దీనికి త్రివిక్రమ్ కుదరదనో సరే అనో చెప్పకుండా.. తర్వాత చూద్దాం అన్నట్లుగా చెప్పారట. అయితే గుణశేఖర్ ‘శాకుంతలం’ సినిమా పనుల్లో ఉండటంతో మళ్ళీ ఆ విషయం డిస్కస్ చేసుకోలేదని తెలుస్తోంది. రచయితగా కెరీర్ స్టార్ట్ చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా మారిన తర్వాత కూడా కొన్ని సినిమాలకు మాట సాయం చేసిన సంగతి తెలిసిందే. ‘తీన్ మార్’ ‘చల్ మోహన్ రంగా’ వంటి చిత్రాలకు త్రివిక్రమ్ వర్క్ చేశారు. అలానే ఇప్పుడు పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘అయ్యప్పనుమ్ కోశీయుమ్’ తెలుగు రీమేక్ కి కూడా డైలాగ్స్ త్రివిక్రమ్ అని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ‘హిరణ్యకశ్యప’ చిత్రానికి త్రివిక్రమ్ సంభాషణలు అందిస్తారో లేదో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.