Templates by BIGtheme NET
Home >> Cinema News >> అలా పైసా ఖర్చు లేకుండా కాజల్ హనీమూన్ !?

అలా పైసా ఖర్చు లేకుండా కాజల్ హనీమూన్ !?


సెలబ్రిటీల తీరు మహా సిత్రంగా ఉంటుంది. వారిని అభిమానించే అభిమానులు చనువుతో ఒక మాట అంటే.. అంతెత్తున విరుచుకుపడతారు.కాస్త అభిమానం పాళ్లు ఎక్కువైతే.. మాకంటూ ప్రైవసీ ఉండొద్దా? మేం మనుషులం కామా? అంటూ ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తారు. ఇన్ని మాటలు చెప్పే వీరంతా.. అభిమానుల పిచ్చ అభిమానంతోనే ఇవన్నీ. కొత్తగా పెళ్లైన జంట.. ప్రైవసీతో సాగే హనీమూన్ డిటైల్స్ ను ఎక్కువగా షేర్ చేసుకోరు. కారణం.. అది పూర్తిగా తమ వ్యక్తిగతమని అనుకోవటమే.

కానీ.. అందాల చందమామ అలియాస్ కాజల్ తీరు మాత్రం కాస్త భిన్నంగా. ఈ మధ్యనే తాను ప్రేమించినోడితో పెళ్లైన ఆమె.. మాల్దీవులకు హనీమూన్ కు వెళ్లటం తెలిసిందే. అక్కడకు వెళ్లిన తర్వాత నుంచి.. తమ ట్రిప్ గురించి వివరాల్ని ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో హనీమూన్ కు వెళ్లి.. వాటి ఫోటోల్ని పెద్ద ఎత్తున పోస్టు చేసిన తార ఎవరైనా ఉన్నారంటే.. అది కాజల్ మాత్రమే. గతంలో కొందరు చేసినా.. ఆమె షేర్ చేసినన్ని ఫోటోలు ఎవరూ చేయలేదు. అయితే.. ఈ ఫోటోలన్ని ఎవరో ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ తీసినట్లుగా ఉండటంతో.. హనీమూన్ కు ఫోటోగ్రాఫర్ ను కూడా వెంటబెట్టుకెళ్లారా? అన్న సందేహం కలిగింది.

ఒకసారి క్వశ్చన్ మనసులోకి వచ్చాక వదలరు కదా? అలా.. ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నంలో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. ఖరీదైన ఫైవ్ స్టార్ హోటల్ లో గడిపిన ఈ కొత్త కఫుల్ కు పైసా ఖర్చు కాలేదన్న నిజం ఇప్పుడు షాకింగ్ గా మారింది. కాజల్.. ఆమె భర్త గౌతమ్ లు బస చేసిన ‘‘ది మురాకా హోటల్’’లో ఒకరోజు బస చేయాలంటే రూ.38 లక్షలు ఖర్చు అవుతుంది. అలాంటిది పది రోజుల పాటు బస చేయటం అందరిని నోరెళ్లబెట్టేలా చేసింది.

ఇద్దరు సెలబ్రిటీలే కావటం.. ఖర్చు విషయంలో వెనుకాడలేదనుకున్న వాళ్లు లేకపోలేదు. కానీ.. హనీమూన్ ను బిజినెస్ డీల్ గా చేసుకున్న కాజల్ ఉదంతం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తమ దేశానికి విదేశీయులు.. అందునా భారతీయ పర్యాటకుల్ని పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు వీలుగా.. సోషల్ మీడియాలో భారీగా ఫాలోవర్లు ఉన్న సెలబ్రిటీలకు మాల్దీవుల పర్యాటక శాఖ ఫ్రీ ఆపర్లు ఇస్తుందట. అందులో భాగంగానే కాజల్ బస చేసిన హోటల్ యాజమాన్యం ఫోన్ చేసి.. మా హోటల్ కు రండి.. పైసా ఖర్చు లేదు.. అంతా ఫ్రీ అని చెప్పిందట. కాకుంటే.. మీ మేకప్.. దుస్తులు మాత్రం వెంట తెచ్చుకోండి.. మిగిలిన ఏర్పాట్లు తాము చేస్తామని చెప్పారట.

తామింత చేస్తున్న దానికి బదులుగా.. తాము తీసే ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేయాలని కోరారట. భారీ ఖర్చు లేకుండా ఎంచక్కా హనీమూన్ ట్రిప్ జరిగిపోవటం.. అందునా.. బస చేసే హోటల్ కు ప్రమోషన్ చేసే పని మీద వెళుతున్న వేళ.. ఉండే ప్రత్యేక ‘కేర్’ నేపథ్యంలో ఓకే చెప్పేసినట్లుగా తెలుస్తోంది. ఈ కారణంతోనే తన హనీమూన్ ఫోటోల్ని చందమామ భారీగా పోస్టు చేయటం వెనుక అసలు కారణం ఇదేనంటున్నారు. ఏమైనా ప్రైవేటు లైఫ్ లోని కొన్ని ముఖ్యమైన ఘట్టాల్ని వ్యాపారంగా మలుచుకునే అవకాశం ఎందరికి వస్తుంది? అది కూడా.. అభిమానుల కారణంగా!